Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ భేష్: ఆర్బీఐ గవర్నర్ ప్రకటన ముఖ్యాంశాలు ఇవీ

కరోనా లాక్‌డౌన్ సమయంలో  తెలంగాణ రాష్ట్రం సహ  కోన్ని రాష్ట్రాలు తీసుకొన్న చర్యలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రశంసించారు.
 

RBI announces Rs 50,000cr support for micro finance
Author
Mumbai, First Published Apr 17, 2020, 11:30 AM IST


న్యూఢిల్లీ: కరోనా లాక్‌డౌన్ సమయంలో  తెలంగాణ రాష్ట్రం సహ  కోన్ని రాష్ట్రాలు తీసుకొన్న చర్యలను ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రశంసించారు.

శుక్రవారం నాడు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ముంబైలో మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్  వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్రం ఈ ఏడాది మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ అమల్లో ఉంది. దీంతో దేశ ఆర్దిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీసుకొన్న చర్యల గురించి ఆయన వివరించారు.

ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటన ముఖ్యాంశాలు

* 2021-22 లో 7.4 జీడీపీ వృద్దిరేటు ఉంటుందని అంచనా

*ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నాం

* జీ20 దేశాల కంటే ఇండియా జీడీపీ అధికం

*రివర్స్ రెపో రేటు 4 నుండి 3.75 శాతానికి తగ్గింపు

*రాష్ట్రాలకు 60 శాతం డబ్ల్యూఎంఏ పెంపు

*మారటోరియం పీరియడ్‌లో 90 రోజుల ఎన్‌పీఏ వర్తించదు

*లాక్‌డౌన్ కారణంగా 30 శాతం విద్యుత్ డిమాండ్ తగ్గింది

* 1930 నాటి ఆర్థిక సంక్షోభాన్ని ప్రస్తుతం చూస్తున్నాం

* జీ20 దేశాల్లో భారత్ జీడీపినే అధికం

* ఆటోమొబైల్ రంగం తీవ్ర నష్టాలను చవి చూస్తోంది

* ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి అందుబాటులోకి రూ.50 వేల కోట్ల నిధులు

* తయారీ రంగం 4 నెలల కనిష్టానికి పడిపోయింది.

* జాతీయ హౌసింగ్ బోర్డుకు రూ.10 వేల కోట్లు

* నాబార్డుకు రూ. 25 వేల కోట్లు

* లఘు పరిశ్రమలకు రూ. 50 వేల కోట్లు

* మైక్రో ఫైనాన్స్ కంపెనీలకు రూ. 50 వేల కోట్లు

* రెపోరేటు యధాతథంగా ఉంటుంది.

* ప్రపంచ జీడీపీకి 9 ట్రిలియన్ డాలర్ల నష్టం

* బ్యాంకులకు నిధుల కొరత లేకుండా చర్యలు

* తయారీ రంగం 4 నెలల కనిష్టానికి పడిపోయింది

* ఆటోమొబైల్ రంగం తీవ్ర నష్టాల్లో ఉంది

* దేశంలో 91 శాతం ఏటీఎంలు పనిచేస్తున్నాయి

* జీడీపీలో 3.2 శాతం ద్రవ్యం విడుదల

Follow Us:
Download App:
  • android
  • ios