ట్యూషన్ క్లాసులు నిర్వహించేందుకు ఆర్థిక సాయం చేస్తానని చెప్పి మహిళా  టీచర్ పై ఓ వ్యక్తి అత్యాాచారానికి పాల్పడ్డాడు. ఆమెతో బలవంతంగా అసహజ శృంగారంలో పాల్గొన్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. 

ఆమె ఓ టీచర్. వయస్సు 34 సంవత్సరాలు. ఆమెకు కొంత కాలం కిందట 45 ఏళ వ్యక్తితో పరిచయం అయ్యింది. అయితే ఆమె ట్యూషన్ క్లాసులు చెప్పాలని ఆలోచిస్తోంది. ఈ విషయంలో అతడు ఆమెకు ఆర్థిక సాయం చేస్తానని చెప్పేందుకు ఇంటికి వెళ్లాడు. అక్కడే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అసహజ శృంగారంలో పాల్గొన్నాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

దారుణం.. 13 ఏళ్ల బాలికను అపహరించి, అత్యాచారం.. ఆపై 15 మందికి విక్రయం.. ఏటా ఇద్దరితో బలవంతంగా వివాహం

మహారాష్ట్రలోని ముంబైలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం..  ముంబైలోని చెంబూర్ తూర్పు శివారు ప్రాంతానికి చెందిన 34 ఏళ్ల మహిళ టీచర్ గా పని చేస్తున్నారు. అయితే ఆమెకు ఓ 45 ఏళ్ల వ్యక్తితో కొంత కాలం క్రితం పరిచయం ఏర్పడింది. దీంతో అతడు ట్యూషన్ క్లాసులకు ఫైనాన్స్ చేసే విషయమై ఆమెతో మాట్లాడతాననే నెపంతో ఈ నెల 13వ తేదీన ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తరువాత ఆ మహిళను తనతో పాటు నవీ ముంబైకి రావాలని కోరాడు. 

ఆగని అఘాయిత్యాలు.. భర్తను బంధించి.. తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారం..

అయితే నిందితుడి ప్రతిపాదనను ఆ మహిళ నిరాకరించింది. దీంతో అతడు మహిళతో అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అసహజ శృంగారానికి ఒడిగట్టాడు. ఈ నేరం చేసిన తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల తరువాత తర్వాత బాధితురాలు ఆర్సీఎఫ్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఆ నిందితుడిని మే 21న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం), 377 (అసహజ నేరం), ఇతర సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు.

ఆ విషయంలో ఆప్ కి మద్దతుగా నిలిచిన కాంగ్రెస్..! నితీష్- ఖర్గే-రాహుల్‌ల కీలక భేటీ

ఉత్తరప్రదేశ్ లోని లక్నో జిల్లాలో కూడా ఇటీవల దారుణ అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. 40 ఏళ్ల వ్యక్తి 14 ఏళ్ల బాలికపై పలుమార్లు లైంగిక దాడికి ఒడిగట్టాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం నిందితుడికి తెలియడంతో అబార్షన్ చేయించినట్లు సమాచారం. ఈ ఘటన జిల్లాలోని గోసాయిగంజ్ పట్టణంలో చోటుచేసుకుంది. బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో నిందితుడు మహ్మద్ ఉమర్ ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.