నటీ, మాజీ ఎంపీ జయప్రదపై నాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారంట్‌ జారీచేసింది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించిన కేసులో విచారణకు  గైర్హాజరు కావడంతో ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌ ప్రత్యేక కోర్టు ఈ చర్యలు తీసుకొన్నది. 

జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్: సీనియర్ నటి, మాజీ ఎంపీ జయప్రదకు రాంపూర్ ప్రత్యేక షాక్ ఇచ్చింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన రెండు కేసుల విచారణ సందర్భంగా కోర్టుకు హాజరు కానందుకు మాజీ ఎంపీ జయప్రదపై రాంపూర్ ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు (ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు) నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ నేపథ్యంలో బెయిలబుల్ రాంపూర్‌కు చెందిన ప్రభుత్వ న్యాయవాది అమర్‌నాథ్ తివారీ మాట్లాడుతూ.. విచారణ సమయంలో మాజీ ఎంపీ, నటి జయప్రద వరుసగా గైర్హాజరు కావడం వల్ల కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కారణంగానే మాజీ ఎంపీపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మంగళవారం విచారణ సందర్భంగా జయప్రదను కోర్టులో హాజరుపరచాలని రాంపూర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ను కోర్టు ఆదేశించినట్లు తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి వాయిదా వేసింది.

రెండు వేర్వేరు ఘటనల్లో కేసు నమోదు

2019లో మాజీ ఎంపీ జయప్రదపై ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనకు సంబంధించి రెండు వేర్వేరు కేసులు నమోదయ్యాయి. మొదటి కేసు ఏప్రిల్ 18, 2019 న, రాంపూర్‌లోని కామ్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిపారియా మిశ్రా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో వీడియో నిఘా బృందం ఇన్‌ఛార్జ్ కుల్దీప్ భట్నాగర్ నమోదు చేశారు. స్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూర్‌పూర్ గ్రామంలో రోడ్డు ప్రారంభోత్సవానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ మేజిస్ట్రేట్ నీరజ్ కుమార్ 2019 ఏప్రిల్ 19న రెండో కేసు నమోదు చేశారు.

ఎమ్మెల్యేలకు కోర్టు శిక్ష 

కేసుల విచారణకు హాజరు కాకపోవడంతో కోర్టు వారెంట్‌ జారీ చేసింది. మాజీ ఎంపీని కోర్టులో హాజరుపరచాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. గతంలో ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులో బహుజన్ సమాజ్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అలీ యూసుఫ్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంజయ్ కపూర్‌లకు కూడా ఇదే కోర్టు శిక్ష విధించడం గమనార్హం.