Rakesh tikait: బులంద్షహర్లో ఏర్పాటు చేసిన కిసాన్ పంచాయితీకి చేరుకున్న రైతు నాయకుడు రాకేష్ టికాయత్ ఓ మహిళా జర్నలిస్టు పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్కడ ఉన్న జర్నలిస్టులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Rakesh tikait-female journalist: రైతు నాయకుడు, భారతీయ కిసాన్ యూనియన్కు చెందిన రాకేష్ టికాయత్ మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. బులంద్షహర్లో ఏర్పాటు చేసిన కిసాన్ పంచాయితీకి చేరుకున్న రాకేష్ టికాయత్.. ఓ మహిళా జర్నలిస్టుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ మహిళా జర్నలిస్టును దెయ్యం అంటూ సంబోధించాడు. దీంతో అక్కడ ఉన్న జర్నలిస్టులు అడ్డుకున్నారు. ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాకేష్ టికాయత్ తనను దెయ్యంగా సంబోధించడంపై ఓ మహిళా జర్నలిస్టు అభ్యంతరం వ్యక్తం చేశారు. శనివారం జరిగిన కిసాన్ పంచాయితీలో రాకేష్ తికైత్ చేసిన ఈ ప్రకటన వివాదాస్పదమైంది.
అసలు ఏం జరిగిందంటే..?
కిసాన్ పంచాయితీ సమయంలో, స్థానిక మీడియా వ్యక్తులు రాకేష్ టికాయత్ మాట్లాడటానికి వచ్చారు. చాలా మంది జర్నలిస్టులు రాకేష్ టికాయత్ ను రకరకాల ప్రశ్నలు అడిగారు. ఇంతలో ఓ మహిళా జర్నలిస్టు రాకేష్ టికాయత్ తో మాట్లాడుతూ మీరు ఔరంగజేబు సమాధికి పూలమాలలు వేయడానికి వెళ్లారంటూ మాట్లాడుతుండగా.. మేము పూలు సమర్పించేందుకు వెళ్లలేదని రాకేష్ టికాయత్ అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ.. ఔరంగజేబు చనిపోయే సమయంలో మంచి ప్రదేశంలో మరణించాడు. ఔరంగజేబు తన ప్రాణాలను విడిచిన చోట జైన దేవాలయం ఉంది. అలాగే, శివాలయం కూడా ఉంది. అని అన్నారు. అందుకే అక్కడకు వెళ్లామని చెప్పారు.
దీని తర్వాత మహిళా జర్నలిస్ట్ రాకేష్ టికాయత్ ప్రశ్నిస్తూ.. ఔరంగజేబు ప్రాణాలు విడిచిపెట్టాడో లేదో తెలియదని, అయితే ఔరంగజేబు ఎన్ని దేవాలయాలను ధ్వంసం చేశాడో, ఎన్ని మసీదులు కట్టాడో మీకు తెలియదా అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు రాకేష్ టికాయత్ సమాధానం చెప్పలేదు. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా.. రాజకీయ పార్టీలంటే ఒక రోగం అంటూ విషయాన్ని వక్రీకరించారు.
జర్నలిస్టును దెయ్యం అంటూ..
రాజకీయ పార్టీలను రోగాలు అంటూ ఎలా అంటారని మహిళా జర్నలిస్ట్.. రాకేష్ టికాయత్ ను ప్రశ్నించారు. దీంతో రాకేష్ టికాయత్ దీనికి కూడా సమాధానం చెప్పకుండా ఇతర విషయాల గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. మహిళను నిరంతరం ప్రశ్నించడంపై రాకేష్ టికైత్ మహిళా జర్నలిస్టును దెయ్యం అని సంబోధించాడు. దీనిపై మహిళా జర్నలిస్ట్ అభ్యంతరం తెలుపుతూ నేను అమ్మాయిని, నన్ను దెయ్యం అని ఎలా అంటారని అన్నారు. మీరు పరిమితులను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. దీనిపై రాకేష్ టికాయత్ మాట్లాడుతూ మీరు నా మాట అస్సలు వినరంటూ పేర్కొన్నారు. 'మీరు నా మాట వినరు, మీరు ప్రశ్నలు మాత్రమే అడుగుతూ ఉంటారు' అని పేర్కొన్నారు. అయితే, రాకేష్ టికాయత్ పై అక్కడకు వచ్చిన జర్నలిస్టులందరూ ఆయన తీరుపై ఆగ్రహంతో పాటు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమవుతున్నాయి.
నెట్టింట్ట ట్రోల్స్.. !
ఓ నెటిజన్ 'ఏదైనా సరే, మహిళలను ఎప్పుడూ గౌరవించాలి, అవమానించకూడదు, బహుశా రైతు నాయకుడు తన గురించి చాలా గర్వంగా మారాడు' అని ట్విట్ చేశారు. మరో నెటిజన్ 'ప్రశ్న వ్యవసాయం మరియు ధర్నా గురించి ఉండాలి మరియు ఔరంగజేబు, మందిర్ మసీదు గురించి కాదు' అని రాశారు. మరో యూజర్ 'చాలా కాలం తర్వాత మాట్లాడారా? భూత్నీ అనే పదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మరియు ఈ పదాన్ని డిక్షనరీ నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాము.' 'మహిళా జర్నలిస్టులు రైతులను ఖలిస్తానీ టెర్రరిస్టులు అని పిలుస్తున్నప్పుడు, వారిని దయ్యాలు అని పిలవడం పెద్ద విషయం' అని మరో నెటిజన్ పేర్కొన్నాడు.
