Asianet News TeluguAsianet News Telugu

బ్రేకింగ్: ఎంపీ అమర్‌సింగ్ కన్నుమూత

సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సింగపూర్‌‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Rajya Sabha MP Amar Singh dies at 64
Author
Singapore, First Published Aug 1, 2020, 4:53 PM IST

సమాజ్ వాదీ పార్టీ మాజీ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సింగపూర్‌‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో శనివారం అమర్ సింగ్ ఆరోగ్యం విషమించడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. అమర్‌సింగ్‌కు భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

2013 నుంచి కిడ్సీ సమస్యతో బాధపడుతున్న ఆయన కొన్ని నెలల పాటు సింగపూర్‌లో చికిత్స తీసుకుంటూ వస్తున్నారు. 1956 జనవరి 27 ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌ఘర్‌లో జన్మించిన అమర్‌సింగ్.. 1996లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2016లో చివరి సారిగా పెద్ద సభకు సమాజ్‌వాదీ పార్టీ నుంచి నామినేట్ అయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios