Asianet News TeluguAsianet News Telugu

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కి కరోనా పాజిటివ్..!

ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. తాజాగా.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కి కూడా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది.

Rajasthan Chief Minister Ashok Gehlot Tests Positive For Covid
Author
Hyderabad, First Published Apr 29, 2021, 11:40 AM IST

కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తోంది. రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో కేసులు పెరుగుతున్నాయి. ఈ మహమ్మారి ఎవరినీ వదలడం లేదు. కొందరు వెంటనే కోలుకుంటుండగా.. మరి కొందరు ఈ దెబ్బ నుంచి బయటపడలేకపోతున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలకు కూడా కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. తాజాగా.. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కి కూడా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది.

తనకు పాజిటివ్ అని నిర్ధారణ అయిందని ట్విట్టర్ ద్వారా ఆయన తెలిపారు. తాను చేయించుకున్న కోవిడ్ టెస్టు రిపోర్టు ఈరోజు వచ్చిందని... అందులో పాజిటివ్ అని తేలిందని ఆయన వెల్లడించారు. పాజిటివ్ వచ్చినా... తనకు కరోనా లక్షణాలు లేవని, ప్రస్తుతం బాగున్నానని చెప్పారు. ఐసొలేషన్ లో ఉంటూ పని చేస్తానని... కోవిడ్ నిబంధనలను, జాగ్రత్తలను పాటిస్తానని తెలిపారు. ఈమేరకు హిందీలో ఆయన ట్వీట్ చేశారు. డాక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో ప్రతి రోజు ఉదయం 8.30 గంటలకు సమీక్షా సమావేశాలను నిర్వహిస్తానని చెప్పారు.  

అశోక్ గెహ్లాట్ భార్య సునీతా గెహ్లాట్ కు నిన్ననే కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో, వెంటనే ఆయన ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. మరోవైపు, రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఎందరో నేతలు వివిధ సమీక్షలు, పర్యవేక్షణలు చేస్తున్నారు. ఆసుపత్రులు, కోవిడ్ సెంటర్లను సందర్శిస్తున్నారు. దీంతో, వారు మహమ్మారి బారిన పడుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios