రానున్న మూడు రోజులు తెలంగాణ, ఏపీ, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు: ఐఎండీ
Rain Forecast: ఏపీ, ఒడిశా, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న మూడు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.
weather report: ఈ వారంలో దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. ఐఎండీ సోమవారం పలు రాష్ట్రాలకు వర్ష హెచ్చరిక జారీ చేసింది. ఈ ఏడాది రుతుపవనాలు చివరి దశలో ఉన్నప్పటికీ, దేశంలోని అనేక ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా నిరంతరాయంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ తాజా బులెటిన్లో.. రాబోయే 3 రోజుల్లో వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల నుండి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని పేర్కొంది. ఇదే సమయంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని కూడా తెలిపింది.
రానున్న మూడు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. సెప్టెంబర్ 21, 22 తేదీల్లో ఒడిశా, తీర ప్రాంతాలు-ఉత్తర ఆంధ్రప్రదేశ్ లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే, గంగా పరివాహక ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్లో 19 నుండి 21వ తేదీ వరకు, విదర్భ, ఛత్తీస్గఢ్ & తూర్పు మధ్యప్రదేశ్లలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అలాగే, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. వీటితో పాటు అస్సాం, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మేఘాలయ సహా పలు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న పరిస్థితులు మధ్య.. ఇటీవలి జల్లుల కారణంగా వాతావరణం ఆహ్లాదకరంగా ఉందని, సోమవారం ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురువడంతో పాటు సాధారణంగా మేఘావృతమైన ఆకాశం ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.
ఐఎండీ తాజా బులిటెన్ లోని వివరాలు ఇలా ఉన్నాయి..
- 18 నుండి 21వ తేదీ వరకు ఒడిశాలో చాలా వరకు విస్తారంగా/విస్తృతంగా తేలికపాటి/మితమైన వర్షపాతం ఉంటుంది. అలాగే, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు/మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది.
- 9న అండమాన్ & నికోబార్ దీవుల్లో వర్షం కురవనుంది. ఇక 20న జార్ఖండ్; 20 & 21న పశ్చిమ బెంగాల్; 22న ఉప-హిమాలయన్ పశ్చిమ బెంగాల్ & సిక్కింలలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే, 20-22 తేదీల మధ్య ఛత్తీస్గఢ్, 21-22న విదర్భ, తూర్పు మధ్యప్రదేశ్ లలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. 22వ తేదీన పశ్చిమ మధ్యప్రదేశ్, మధ్య మహారాష్ట్ర, ఉత్తర కొంకణ్లోని ఘాట్ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐంఎండీ అంచనా వేసింది.
- సెప్టెంబరు 19 నుండి 21 వరకు ఒడిశాలో కూడా చాలా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- సెప్టెంబర్ 19 నుండి 21వ తేదీ వరకు కోస్తా ఆంధ్ర ప్రదేశ్ & యానాం, తెలంగాణా మీదుగా విస్తారంగా విస్తారంగా తేలికపాటి/మోస్తరు వర్షపాతంతో పాటు పలు చోట్ల ఉరుములు/మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- రాబోయే 5 రోజులలో ఉత్తరాఖండ్, తూర్పు ఉత్తరప్రదేశ్లో వివిక్త ఉరుములు/మెరుపులతో అక్కడక్కడ తేలికపాటి/మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
- ఈ నెల 21వ తేదీ వరకు అస్సాం, మేఘాలయలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. అలాగే, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం & త్రిపురలలో భారీ వర్షాలతో పాటు పలు చోట్ల ఉరుములు/మెరుపులతో విస్తారంగా తేలికపాటి/మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.