ఎట్టకేలకు మహారాష్ట్ర అసెంబ్లీలో ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం మొదటి విజయం సాధించింది. అసెంబ్లీలో స్పీకర్ పదవి షిండే వర్గం మద్దతుతో బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నార్వేకర్ ను వరించింది. ఆయన ఆధ్వర్యంలో రేపు కొత్త ప్రభుత్వం బల నిరూపణ చేసుకోనుంది.   

మహారాష్ట్ర అసెంబ్లీకి కొత్త స్పీక‌ర్ గా రాహుల్ నార్వేకర్ ఎంపికయ్యారు. బీజేపీ నుంచి బ‌రిలో దిగిన ఆయ‌న‌కు 164 ఓట్లు రాగా, శివ‌సేన నుంచి ఎంవీఏ త‌రుఫున పోటీలో ఉన్న రాజన్ సాల్వీకి 107 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నిక బీజేపీ సహ‌కారంతో కొత్త‌గా ఎన్నికైన సీఎం ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో జ‌రిగింది. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా చేప‌ట్టారు. ఇద్దరు అభ్యర్థుల ఓట్ల లెక్కింపు హెడ్ కౌంటింగ్‌తో ప్రారంభమైంది. మొదట రాహుల్ నార్వేకర్ మద్దతుదారులు వారి పేర్లను నంబర్‌లతో చెప్పడం ప్రారంభించ‌గా.. ఆయ‌న‌కే అత్యధిక ఓట్లు వచ్చాయి.

ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని.. శిశువు మృతదేహంతో పోలీసు స్టేషన్‌కు చేరిన తండ్రి

ఈ ఎన్నిక‌ల్లో రాజ్ ఠాక్రేకు చెందిన MNS (మ‌హారాష్ట్ర న‌వ నిర్మాణ సేన) పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్‌కు మద్దతు ఇవ్వగా, ఇద్దరు సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఇద్ద‌రు ఎమ్మెల్యేలు అబూ అజ్మీ, రైస్ షేక్ ఓటింగ్‌లో అస‌లు ఓటింగ్ లోనే పాల్గొన‌లేదు. శివసేన ఎమ్మెల్యే యామిని యశ్వంత్ జాదవ్ ఓటింగ్ లో పాల్గొన్న‌ప్పుడు.. ప్రతిపక్ష బెంచ్‌లోని శాసనసభ్యులు ‘‘ఈడీ, ఈడీ (ED-ED)’’ అంటూ నినాదాలు చేశారు. ఓటింగ్‌కు ముందు డిప్యూటీ స్పీకర్ ఆదేశాలతో సభ గేట్లన్నీ మూసేశారు. నేటి నుంచి ప్రారంభమైన రెండు రోజుల అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో రేపు ఫ్లోర్ టెస్ట్ జరగనుంది. ఇందులో షిండే ప్రభుత్వం తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. 

న్యాయ వ్య‌వ‌స్థ పూర్తిగా స్వ‌తంత్ర‌మైన‌ది.. అది రాజ్యాంగానికి మాత్ర‌మే జ‌వాబుదారి - సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌

ఈ స‌మావేశానికి ముందు బీజేపీ నేత ముంగంటివార్ ఎమ్మెల్యేల‌తో మాట్లాడారు. సభ్యులందరూ తమ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.‘‘ స్పీకర్ పదవికి బీజేపీ అభ్యర్థి రాహుల్ నార్వేకర్ పేరు ప్రతిపాదిస్తారు. ముందుగా వాయిస్ ఓటింగ్ ఉంటుంది. ఎవరైనా ఓట్ల విభజన కోరితే అది పూర్తవుతుంది. ఎన్నికైన స్పీకర్ బాధ్యతలు స్వీకరిస్తారు. మా అభ్యర్థే గెలుస్తారని మేము ఆశిస్తున్నాము.’’ అని అన్నారు. ‘‘ స్పీకర్ ఎన్నికలో ఎలాంటి విప్ అమలు చేయబడలేదు కాబట్టి సభ్యులందరూ వారి మనస్సాక్షి ప్రకారం ఓటు వేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బాలాసాహెబ్ ఠాక్రే సిద్ధాంతాలను పాటించే శివసేన విప్ ఇచ్చింది. ఉద్ధవ్ థాకరే వర్గం కూడా అదే విధంగా విప్ జారీ చేసింది. బాలాసాహెబ్ శివసేనతో మాకు పొత్తు ఉంది ’’ అని ఆయన అన్నారు. 

Nupur Sharma: నుపూర్ శ‌ర్మ‌ను అరెస్టు చేయండి: జమాతే ఇస్లామీ హింద్

ఈ అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాల్సి ఉన్నందున్న ఆరే ఫారెస్ట్ కోసం చేస్తున్న నిరసనలో తాను ఈ రోజు పాల్గొనడం లేదని ఆదిత్య ఠాక్రే పేర్కొన్నారు. ‘‘ నేను ఈరోజు రాష్ట్ర అసెంబ్లీ సమావేశానికి హాజరుకావలసి ఉంది. కాబట్టి ఆరే ఫారెస్ట్, MMRCL భూమి కోసం చేస్తున్న నిరసనను నేను ఈ రోజు మిస్ అవుతున్నాను. కొత్త ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించవలసిందిగా నేను వినయపూర్వకంగా కోరుతున్నాను. మాపై ఉన్న ప్రియమైన ముంబైపై వేయొద్దు. ’’ అని ఆయన ట్వీట్ చేశారు.