జోరుగా సాగుతోన్న భారత్ జోడో యాత్ర.. సైక్లిస్ట్ గా మారిన రాహుల్..
కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జోరుగా కొనసాగుతోంది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లో సాగుతోన్న ఈ యాత్రలో రాహుల్ గాంధీ సైక్లిస్ట్గా మారారు. పార్టీ శ్రేణులు, ప్రజలు పూలు చల్లుతుండగా సైకిల్ తొక్కుతూ ముందుకు సాగారు. అంతకుముందు మో ప్రాంతంలో ఆదివారం రాయల్ ఎన్ఫీల్డ్ నడిపి కార్యకర్తల్లో జోష్ నింపాడు.
కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర జోరుగా కొనసాగుతోంది. ఈ యాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్లో సాగుతోంది. యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ సోమవారం సైక్లిస్ట్గా మారారు. పార్టీ మాజీ అధినేత రాహుల్ గాంధీపై కార్యకర్తలు, ప్రజలు పూలు చల్లుతుండగా.. ఆయన సైకిల్ తొక్కుతూ ముందుకు సాగారు. కార్యకర్తలు,భద్రతా సిబ్బంది తన వెంట రాగా సైకిల్ సవారీ చేశారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ వివిధ వర్గాల ప్రజలతో మమేకమై.. వారి సమస్యలను తెలుసుకుంటున్నారు.
అంతకుముందు.. రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో.. నడి రోడ్డుపై పిల్లవాడితో పుష్ అప్లు చేస్తూ.. గిరిజన మహిళతో కలిసి స్టెప్పులేస్తూ.. పిల్లలతో కరాటే ప్రాక్టీస్ చేస్తూ.. ఫుట్బాల్ ఆడుతూ.. బుల్లెట్ బైక్ ఎక్కి రయ్ రయ్ మంటూ దుసుకెళ్తడం వంటివి చేస్తూ అన్ని కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. అన్ని వర్గాల ప్రజలతో కలిసి మందుకు సాగుతున్నారు. ఆయన రోజురోజుకు మరింత విభిన్నంగా కనిపిస్తూ.. ఉల్లాసంగా యాత్రను ముందుకు కొనసాగిస్తున్నారు. ఈ యాత్ర ప్రారంభం నుండే రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. ఇటు ఆన్ లైన్ లోనూ.. అటు ఆఫ్ లైన్ లోనూ దూసుకుపోతున్నారు.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ సాగనున్న రాహుల్ పాదయాత్ర ప్రస్తుతం మధ్యప్రదేశ్ మీదుగా సాగుతోంది. ఇప్పటివరకూ ఈ యాత్ర ఏడు రాష్ట్రాల్లోని 34 జిల్లాలను కవర్ చేశారు.ఈ యాత్ర సందర్భంగా మోదీ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ రాహుల్ యాత్రను కొనసాగిస్తున్నారు.