Asianet News TeluguAsianet News Telugu

 ప్రమాదంలో ప్రజాస్వామ్యం.. రాజ్యాంగ వ్యవస్థలపై కేంద్రం దాడి :  మల్లికార్జున్ ఖర్గే  

ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన తరుణంలో కాంగ్రెస్‌ ఆదర్శంగా నిలుస్తోందని కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే అన్నారు.సోనియా గాంధీ వ్యక్తిగత త్యాగాలు చేశారని, 25 ఏళ్లుగా కష్టపడి, రక్తంతో పార్టీకి సేవ చేశారని ఖర్గే అన్నారు. అక్టోబర్ 26న ఖర్గే బాధ్యతలు స్వీకరించనున్నారు.
 

Rahul Gandhi to be in Delhi on Oct 26 for Kharge  charge-taking ceremony
Author
First Published Oct 22, 2022, 5:43 AM IST

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే: ప్రజాస్వామ్యం, దేశం ప్రమాదంలో పడిన తరుణంలో కాంగ్రెస్ 
సంస్థాగత ఎన్నికలను నిర్వహించిందని ఆ పార్టీ నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే శుక్రవారం అన్నారు.  ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఏర్పాటు చేయబడిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఖర్గేకు 7897 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి శశిథరూర్‌కు అనుకూలంగా 1072 ఓట్లు మాత్రమే వచ్చాయి.

తన విజయం తర్వాత ఖర్గే మీడియాతో మాట్లాడుతూ..దేశ 75 ఏళ్ల చరిత్రలో కాంగ్రెస్ నిరంతరం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిందని, రాజ్యాంగాన్ని పరిరక్షించిందని అన్నారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడి,రాజ్యాంగంపై దాడి జరుగుతోందని, ప్రతి సంస్థను విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు.. జాతీయ స్థాయిలో సంస్థాగత ఎన్నికలు నిర్వహించి దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఎన్నికల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. థరూర్‌కు అభినందనలు తెలిపిన ఆయన... పార్టీని ముందుకు తీసుకెళ్లే మార్గాలపై చర్చించినట్లు చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఖర్గే విజయం సాధించినందుకు అభినందనలు తెలిపేందుకు శశి థరూర్ ఆయన నివాసానికి వెళ్లారు.

సోనియాకు ధన్యవాదాలు  

కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ అధ్యక్షునికి సోనియా గాంధీకి శుభాకాంక్షలు తెలియజేశారు.పార్టీకి సేవ చేయడానికి చాలా సంవత్సరాలు ఆయన వ్యక్తిగత త్యాగాలు చేశారని సోనియా అన్నారు. సోనియా నాయకత్వాన్ని కొనియాడిన ఖర్గే, ఆమె పార్టీ అధినేత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని అన్నారు. పార్టీ కార్యకర్తలందరి తరపున సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. వ్యక్తిగత త్యాగాలు చేసి 25 ఏళ్లుగా కష్టపడి, రక్తంతో పార్టీకి సేవలందించారని సోనియా గాంధీని ఖర్గే ప్రసంశించారు.  
 
ఇండియా జోడో యాత్రలో చేరాలని విజ్ఞప్తి

పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి 'భారత్ జోడో యాత్ర'లో పాల్గొనాలని ఖర్గే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశంలో అతిపెద్ద సమస్య ద్రవ్యోల్బణం. అలాగే.. దేశంలో నిరుద్యోగం, పేద ధనిక మధ్య అంతరం పెరుగుతోంది. ప్రభుత్వం విద్వేషాన్ని వ్యాప్తి చేయడంలో నిమగ్నమై ఉందని విమర్శించారు.  ఈ సమస్యలపై పెద్దఎత్తున ఉద్యమం చేసేందుకు రాహుల్ గాంధీ 3570 కిలోమీటర్లు ప్రయాణించారని తెలిపారు. రాహుల్ గాంధీ  పోరాటానికి యావత్ దేశం అండగా నిలుస్తోందనీ,  దేశ సంక్షేమం కోసం రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని దేశ ప్రజలకు తాను విజ్ఞప్తి చేస్తున్నానని ఖర్గే చెప్పారు.

మనమందరం పార్టీ కార్యకర్తల్లా పని చేయాలని ఖర్గే అన్నారు. పార్టీలో చిన్నా పెద్దా ఎవరూ లేరు. మతతత్వం ముసుగులో ప్రజాస్వామ్య సంస్థలపై దాడి చేస్తున్న ఫాసిస్టు శక్తులపై ఐక్యంగా పోరాడాలి. అక్టోబర్ 26న ఖర్గే బాధ్యతలు స్వీకరిస్తారని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios