యాత్రను భగ్నం చేయాలని బిజెపి-సంఘ్ నేతల కుట్ర.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి బీజేపీ, ఆర్ఎస్ఎస్ లను టార్గెట్ చేస్తూ.. విమర్శలు గుప్పించారు. భారత్ జోడో యాత్రను భగ్నం చేయడానికి బిజెపి-సంఘ్ నేతలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తమలో తాము పోరాడాలని కోరుకుంటారనీ, బిజెపి-సంఘ్ నేతలు విద్వేషాన్ని వ్యాప్తి చేస్తూ దేశాన్ని నడుపుతున్నారని విమర్శించారు.
భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి బీజేపీ, ఆర్ఎస్ఎస్ లను టార్గెట్ చేస్తూ.. విమర్శలు గుప్పించారు, నిరుద్యోగ సమస్యను కూడా లేవనెత్తారు. యూనివర్శిటీ డిగ్రీ చదివి ఉద్యోగం పొందలేని భారతదేశాన్ని మేము అంగీకరించబోమని కేరళలోని పాలక్కాడ్లో రాహుల్ అన్నారు. భారత్ జోడో యాత్రను భగ్నం చేయడానికి బిజెపి-సంఘ్ నేతలు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ర్యాలీలో పాల్గొన్న ప్రజలు విభజించాలని వారు ప్రయత్నిస్తున్నారనీ, ప్రజలు తమలో తాము పోరాడాలని కోరుకుంటున్నారని రాహుల్ అన్నారు.
కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ సోమవారం సాయంత్రం నాటికి 19 రోజుల్లో 419 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. మోడీకి సన్నిహితంగా ఉండే వ్యాపారుల వేలకోట్ల రుణాలను మాఫీ చేయడం.. ఆ ప్రభావం చిన్న రైతులు లేదా చిన్న వ్యాపారులపై పడుతోందని, అన్యాయాలకు వ్యతిరేకంగా పాదయాత్ర చేస్తున్నట్టు తెలిపారు. ప్రజలను చైతన్యం చేయడమే ఈ పాదయాత్ర ఉద్దేశ్యమని అన్నారు.
కొప్పంలో సోమవారం పర్యటన ముగింపు సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కొంతమంది ధనిక వ్యాపారుల రుణాలను మాఫీ చేయడం ద్వారా వారికి అనుకూలంగా వ్యవహరిస్తోందని, రైతులు, చిన్న వ్యాపారులు మరియు ఇతరులను సమానంగా చూడటం లేదని అన్నారు.
బడా పారిశ్రామికవేత్తల వేల కోట్ల రుణాలు మాఫీ
మోడీ సర్కార్.. బడా పారిశ్రామికవేత్తల కోట్లాది రుణాలను మాఫీ చేస్తోందనీ. కానీ, రైతు లేదా చిన్న వ్యాపారి చిన్నపాటి రుణాలను చెల్లించలేకపోతే.. వారిని డిఫాల్టర్గా జైలులో పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ జోడో యాత్ర ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా ఉంటుందని అన్నారు. ఎల్పిజి సిలిండర్లు కొనుగోలు చేసేటప్పుడు లేదా వారి వాహనాలకు ఇంధనం నింపేటప్పుడు, వారి నుండి వసూలు చేస్తున్న అదనపు డబ్బు ఎక్కడికి పోతుందో ప్రజలు అడగాలని అన్నారు. డబ్బు మాయమైపోదని, దేశంలోని ఐదారుగురు సంపన్న వ్యాపారుల జేబుల్లోకి వెళ్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ అన్యాయాన్ని ప్రజలు ఎట్టి పరిస్థితిల్లో అంగీకరించబోరని అన్నారు.
ఇదిలా ఉండగా.. ఏఐసీసీ ఇన్ఛార్జ్ కమ్యూనికేషన్ సెక్రటరీ జైరాం రమేష్ ట్వీట్ చేస్తూ, “#భారత జోడి యాత్ర 19వ రోజు కొప్పంలో ముగుస్తుంది. గొప్ప స్పందన! ఇవాళ రాహుల్ 22 కిలోమీటర్లు నడిచారు. నేటీతో 419 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది అని పేర్కొన్నారు.
రాహుల్ను కలిసేందుకు రోడ్డుకు ఇరువైపులా వందలాది మంది వేచి ఉన్నారు. కొంతమంది యువతులు తమ ఫ్రేమ్డ్ డ్రాయింగ్ను కాంగ్రెస్ నాయకుడికి అందించారు. రాహుల్ చిత్రాన్ని పట్టుకున్న యువతుల చిత్రంతో పార్టీ ట్వీట్ చేసింది. @రాహుల్ గాంధీని మరియు పాదచారులందరిని స్వాగతం పలకడానికి యువకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వారి ఉజ్వల భవిష్యత్తుకు పార్టీ రుణపడి ఉంటుంది. మీ లక్ష్యాన్ని సాధించడానికి. #భారత్ జోడోయాత్ర. అని కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో పేర్కొంది.