కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ఎంపీ రాహూల్ గాంధీ చేపట్టడం ఖాయమైపోయింది. అయితే ఢిల్లీ వేదికగా ఈ విషయాన్ని ప్రకటిస్తారా? అయితే ఈ విషయాన్ని ఢిల్లీ వేదికగా ప్రకటిస్తారా? వేరే వేదికగానా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
కొత్త సంవత్సరంలో కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు ఎంపీ రాహూల్ గాంధీ చేపట్టడం ఖాయమైపోయింది. అయితే ఢిల్లీ వేదికగా ఈ విషయాన్ని ప్రకటిస్తారా? అయితే ఈ విషయాన్ని ఢిల్లీ వేదికగా ప్రకటిస్తారా? వేరే వేదికగానా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
కొత్త సంవత్సరంలో ఢిల్లీ వేదికగా ఏఐసీసీ ప్లీనరీ నిర్వహిస్తారని, ఆ ప్లీనరి వేదికగా రాహుల్ను అధ్యక్షుడిగా ప్రకటిస్తారని వార్తలొచ్చాయి. అయితే తాజాగా కాంగ్రెస్ ఈ వేదికను మార్చినట్లు సమాచారం. ఢిల్లీ వేదికగా కాకుండా ఏఐసీసీ ప్లీనరిని రాజస్థాన్ లో నిర్వహించాలని డిసైడ్ అయ్యింది.
ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ అధిష్ఠానంతో చర్చించి, ఈ నిర్ణయానికి వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే రాజస్థాన్లో ఏ ప్రాంతంలో ప్లీనరీని నిర్వహించాలన్నది మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు.
రాహుల్ గాంధీ విదేశాల నుంచి తిరిగి రాగానే ప్లీనరి నిర్వహించే ప్రాంతంపై అధికారిక ప్రకటన వెలువడుతుందని ఏఐసీసీ వర్గాలు తెలిపాయి. అయితే 2012 లో జైపూర్ లో కాంగ్రెస్ ప్లీనరి జరిగింది. ఈ వేదికగానే రాహుల్ గాంధీని కాంగ్రెస్ ఉపాధ్యక్షునిగా పార్టీ ప్రకటించింది.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 28, 2020, 11:00 AM IST