Asianet News TeluguAsianet News Telugu

డేటింగ్ యాప్‌తో వల: మత్తిచ్చి చోరీ, చివరికిలా..

డేటింగ్ యాప్ పేరుతో మగాళ్లకు వల వేసి డబ్బులు  దోచేసిన ఓ కిలాడీ లేడీని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.సోషల్ మీడియా వేదికగా మగాళ్లకు వలవేసి దోచుకొంటుంది.

Pune Woman arrested for robbing 16 men she met through online dating app in past year lns
Author
Pune, First Published Feb 5, 2021, 3:31 PM IST


పుణె:డేటింగ్ యాప్ పేరుతో మగాళ్లకు వల వేసి డబ్బులు  దోచేసిన ఓ కిలాడీ లేడీని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.సోషల్ మీడియా వేదికగా మగాళ్లకు వలవేసి దోచుకొంటుంది.

ఓ మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలో నిందితురాలు పనిచేసేది. లాక్ డౌన్ కారణంగా ఆమె ఉద్యోగాన్ని కోల్పోయింది. దీంతో ఆమె ఇంటికే పరిమితమైంది.

ఆన్‌లైన్ డేటింగ్ యాప్స్ టిండర్, బంబుల్ లో తన ప్రొఫైల్ ని ఆమె అప్ లోడ్ చేసింది. ఈ యాప్ ద్వారా పరిచయమైన మగాళ్లను తన మాటలతో నమ్మించేది.

మాటలను కలిపిన వారిని కలుసుకోవాలని హోటల్ గదికి ఆమ్వానించేది. తన కోరిక మేరకు హోటల్ కు వచ్చిన మగాళ్లకు కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి ఇచ్చేది. 

ఈ డ్రింక్ తాగిన వారు మత్తులోకి జారుకొనేవారు. మత్తులో జారుకొన్న వారి వద్ద ఉన్న విలువైన వస్తువులను ఆమె తీసుకొని పారిపోయేది.

ఇదే తరహాలో ఆశిష్ అనే వ్యక్తిని కూడ హోటల్ కు రప్పించింది. మత్తు మందు కలిపిన డ్రింక్స్ ఇచ్చింది. ఈ డ్రింక్ తాగిన ఆశిష్ మత్తులోకి జారుకొన్నాడు.  ఆశిష్ వద్ద ఉన్న బంగారం, డబ్బు మాయమయ్యాయి. నిందితురాలు కన్పించకపోవడంతో జరిగిన మోసం అర్ధమైంది.

దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు  విచారణ జరిపారు. టెక్నాలజీ ఆధారంగా నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఆమె వద్ద నుండి రూ. 15. 25 లక్షల విలువైన బంగారం, డబ్బు స్వాధీనం చేసుకొన్నారు. ఈ రకంగా సుమారు 16 మందిని ఆమె మోసం చేసినట్టుగా పోలీసులు విచారణలో గుర్తించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios