PUBG game: ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. PUBG game ఆడనివ్వడం లేదని కన్నతల్లిని ఓ తనయుడు రివాల్వర్ తో కాల్చి చంపాడు. ఆ విషయం బయటకు రాకుండా తన చెల్లిని గదిలో బంధించాడు. తల్లి మృతదేహాం నుంచి వాసన రాకుండా ప్రెషనర్ చల్లుతూ 3 రోజుల పాటు గదిలో పెట్టాడు.
PUBG game: ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. PUBG గేమ్ ఆడనివ్వడం లేదని 16 ఏళ్ల బాలుడు తన తల్లిని గన్ లో కాల్చి చంపాడు. ఆ తర్వాత మృతదేహాన్ని మూడు రోజుల పాటు ఇంట్లోనే దాచి ఉంచారు. చెల్లెల్ని ఓ గదిలో బంధించారు. అనంతరం మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో హత్యగా జరిగిందని తప్పుడు కథనం సృష్టించి.. పోలీసులకు సమాచారం అందించారు. చివరికి విచారణలో అసలు కథ బయటపడింది. ఈ ఘటన లక్నోలోని పీజీఐ ప్రాంతంలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. లక్నోలోని పీజీఐ ప్రాంతంలోని ఆల్డికో కాలనీలో సాధన (40 ) తన 16 ఏళ్ల కుమారుడు, 10 ఏళ్ల కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు. సాధన భర్త ఆర్మీ అధికారి. ఆయన కోల్కతాలో సేవలందిస్తున్నారు. ఈ క్రమంలో సాధన కొడుకు PUBG గేమ్ కు బానిసయ్యాడు. గేమ్ ఆడోద్దని అనేక పలుమార్లు తల్లి మందలించింది. కానీ.. తల్లి మాటను పెడ చెవిన పెట్టాడు ఆ బాలుడు. ఈ క్రమంలో గత నాలుగు రోజుల కింద తల్లి గేమ్ ఆడొద్దని ఆ బాలుడినిఅడ్డుకుంది. దీంతో ఆ బాలుడు కోపోద్రిత్తుడై.. ఇంట్లో గొడవకు దిగాడు. ఈ విషయాన్ని తండ్రికి చెప్పింది.
లైసెన్స్ తుపాకీతో తల్లిని హత్య
ఈ క్రమంలో ఆదివారం తల్లితో మరోసారి గొడవ జరిగింది. PUBG గేమ్ ఆడటం మానేయాలని వార్నింగ్ ఇచ్చింది. దీంతో కోపోద్రిత్తుడైన ఆ బాలుడు తండ్రి లైసెన్స్ పిస్టల్ తీసుకవచ్చి.. నేరుగా తల్లి తలపై కాల్చాడు. దీంతో తల్లి అక్కడికక్కడే మరణించింది. ఆ తర్వాత నిందితుడు చెల్లెల్ని బెదిరించి మరో గదిలో బంధించాడు.
మూడు రోజులుగా తల్లి మృతదేహంతో..
హత్య చేసిన అనంతరం తల్లి మృతదేహాన్ని ఓ గదిలో పెట్టి.. మూడు రోజుల పాటు తల్లి మృతదేహంతో ఉన్నాడు. ఈ క్రమంలో మృత దేహం వాసన రాకుండా.. రూమ్ ఫ్రెషనర్ ఉపయోగించాడు. దుర్వాసన ఎక్కువ కావడంతో మంగళవారం సాయంత్రం తండ్రికి ఫోన్ చేసి తల్లి హత్యపై సమాచారం అందించాడు. ఆ తర్వాత తండ్రి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు.
పోలీసులను తప్పుదోవ
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసుల ఆ బాలుడిని విచారించగా.. తప్పుదోవ పట్టించి.. ఇంటికి ఓ ఎలక్ట్రీషియన్ వచ్చానని, ఈ క్రమంలో తన తల్లికి అతడికి వాగ్వాదం జరిగిందని, అతడే తన తల్లిని చంపాడని ఓ కట్టు కథ చెప్పాడు. కానీ, విచారణ జరిపిన రెండున్నర గంటల్లోనే మొత్తం కథ బయటకు రావడంతో నిందితుడైన కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై సీనియర్ లక్నో పోలీసు అధికారి SM ఖాసిం అబిది మీడియాతో మాట్లాడుతూ.. మొదట్లో, బాలుడు ఒక బూటకపు కథను చెప్పాడని, కానీ.. పోలీసుల విచారణలో బాలుడు నేరం అంగీకరించాడని, తదుపరి విచారణ జరుగుతోందని చెప్పారు.