హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో గెలిచినప్పటికీ కాంగ్రెస్ ను వీడని సమస్యలు..?
Congress: హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి రేసులో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ ముందువరుసలో ఉండగా, ఆ తర్వాత పార్టీ మాజీ చీఫ్ సుఖ్విందర్ సింగ్ సుఖు, సీనియర్ నాయకుడు ముఖేష్ అగ్నిహోత్రి ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నారు.
Himachal Assembly Election Result: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన కాంగ్రెస్ కు మరో కొత్త సమస్య వచ్చిపడింది. ఇప్పుడు రాష్ట్ర అత్యున్నత పదవి ముఖ్యమంత్రి రేసులో పలువురు సీనియర్ నాయకులు పోటీ పడటంతో కాంగ్రెస్ మళ్లీ తలలు పట్టుకుంటున్నదని సమాచారం. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న తరుణంలో.. ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నవారితో మళ్లీ సమస్యల్లోకి జారుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖ్యమంత్రి రేసులో రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ ముందువరుసలో ఉండగా, ఆ తర్వాత పార్టీ మాజీ చీఫ్ సుఖ్విందర్ సింగ్ సుఖు, సీనియర్ నాయకుడు ముఖేష్ అగ్నిహోత్రి ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నారు.
రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ప్రతిభా సింగ్ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ, ఎమ్మెల్యే కానప్పటికీ, ఆమె హిమాచల్ లో వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసింది. కాంగ్రెస్ గెలుపులో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం, ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సొంత జిల్లా నుంచి ఉప ఎన్నికలో గెలిచిన తర్వాత సింగ్ మండి ఎంపీగా ఉన్నారు. పార్టీ వర్గాల ప్రకారం, వీరభద్ర సింగ్కు విధేయత చూపిన మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ప్రతిభా సింగ్కు ఉంది. ప్రతిభా సింగ్ కుమారుడు విక్రమాదిత్య సిమ్లా రూరల్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. సీఎం పదవికి చాలా చిన్నవాడు అని చాలామంది భావించినప్పటికీ, ఆశావహుల్లో కూడా ఉన్నారు. ఇతర పోటీదారులు నదౌన్ నుండి ఎమ్మెల్యే సుఖు, హరోలి నుండి ఎన్నికైన అగ్నిహోత్రి. పీసీసీ మాజీ చీఫ్గా, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేతగా తమ పనితనాన్ని కాంగ్రెస్ హైకమాండ్ గుర్తిస్తుందని ఇద్దరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అగ్నిహోత్రి ప్రకారం.. అతను రాష్ట్ర అసెంబ్లీలో CLP నాయకుడిగా రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ స్థానాన్ని బలమైన నాయకుడు. గత ఐదేళ్లలో బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను, ప్రభుత్వ తీరును ఎండగట్టడంలో కీలక పాత్ర పోషించారు. అగ్నిహోత్రి బ్రాహ్మణ నాయకుడు కాగా సుఖు ఆధిపత్య ఠాకూర్ వర్గానికి చెందినవారు. థియోగ్ నుంచి గెలిచిన పీసీసీ మాజీ చీఫ్ కుల్దీప్ సింగ్ రాథోడ్ కూడా సీఎం ఆశావహుల లిస్టులో ఉన్నారు. రాథోడ్ స్థానంలో ప్రతిభా సింగ్ను హిమాచల్ యూనిట్ హెడ్గా నియమించారు.
ఇదిలాఉండగా, శుక్రవారం సిమ్లాలో కాంగ్రెస్ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో సీఎల్పీ నేతను ఎన్నుకునేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడికి అధికారం ఇస్తూ తీర్మానం చేసే అవకాశం ఉంది. హిమాచల్ ప్రదేశ్ ఏఐసీసీ ఇన్చార్జి రాజీవ్ శుక్లా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం తమకు లభిస్తున్నందుకు సంతోషంగా ఉందనీ, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన 10 హామీలను నెరవేర్చేందుకు పార్టీ అన్ని విధాలా కృషి చేస్తుందని అన్నారు. "కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్నికల ఫలితాల అనంతరం శుక్రవారం సిమ్లాలో సమావేశమై కొత్త శాసనసభా పక్ష నేతను ఎన్నుకోవడంపై నిర్ణయం తీసుకుంటారు" అని శుక్లా తెలిపారు.
కాగా, తాజా హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 68 స్థానాలకు గానూ కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల్లో, బీజేపీ 25 స్థానాల్లో, ఇతరులు 3 నియోజకవర్గాల్లో విజయం సాధించారు. మ్యాజిక్ ఫిగర్ 35 స్థానాలుగా ఉంది.