ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ కొనియాడారు. యూపీ ఎన్నికల విజయం క్రెడిట్ మొత్తం ప్రధాని మోడీదే అని ప్రశంసించారు. యూపీలో బీజేపీ ఇంత ఘన విజయం సాధిస్తుందని అస్సలు ఊహించలేదని చెప్పారు. 

ఇటీవల ముగిసిన ఉత్తరప్రదేశ్ (uttar pradesh) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ (bjp) విజయం సాధించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ (prime minister narendra modi)ని కాంగ్రెస్ నాయ‌కుడు శ‌శి థ‌రూర్ (Congress leader Shashi Tharoor) ప్ర‌శంసించారు. ప్ర‌ధాని అద్భుతమైన శ‌క్తి, చైతన్యవంతమైన వ్యక్తి అని కొనియాడారు. ‘‘ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అద్భుతమైన శక్తి, చైతన్యం కలిగిన వ్యక్తి. ముఖ్యంగా రాజకీయంగా చాలా ఆకట్టుకునే కొన్ని పనులను చేశారు. ఆయ‌న అంత గొప్ప సీట్ల‌లో గెలుస్తాడ‌ని మేము ఊహించలేదు. కానీ ఆయ‌న‌ గెలిచాడు” అని ఆదివారం జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌ (Jaipur Literature Festival) లో శ‌శి థ‌రూర్ మీడియాతో సంభాషించారు. 

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల విషయంలో శశి థరూర్ మాట్లాడుతూ ఒక రోజు భారతీయ ఓటరు భారతీయ జనతా పార్టీ (bjp)ని ఆశ్చర్యపరుస్తారని అన్నారు. అయితే ఈ రోజు ప్రజలు వారికి (బీజేపీ) వారు కోరుకున్నది ఇచ్చారని అన్నారు. ప్ర‌ధాని మోదీని ప్రశంసించిన తర్వాత శ‌శి థ‌రూర్ మాట్లాడుతూ.. “ అయితే ఆయ‌న మన దేశాన్ని మతపరమైన ప్రాతిపదికన విభజించే సమాజంలో అలాంటి శక్తులను వదులుకున్నాడు. ఇది నా అభిప్రాయం ప్రకారం దురదృష్టకరం అనే విషాన్ని ప్రవేశపెడుతోంది. అని తెలిపారు. యూపీ (up) ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను రాజకీయ విశ్లేషకులు ‘‘ముందస్తు ముగింపు’’ గా అభివర్ణించడంపై తాను ఆశ్చర్యపోయానని తెలిపారు. ఎగ్జిట్ పోల్స్ (exit poles) వెలువడే వరకు చాలా తక్కువ మంది మాత్రమే బీజేపీ విజయాన్ని అంచనా వేశారని థరూర్ తెలిపారు. 

‘‘ ఎగ్జిట్ పోల్స్ వెలువడే వరకు నా మ‌దిలో ఎలాంటి సందేహం లేదు. చాలా మంది ప్రజలు చాలా టఫ్ ఫైట్ ఉంటుంద‌ని ఆశించారు. కొంద‌రు స‌మాజ్ వాదీ పార్టీ (samajwadi party) ముందంజ‌లో ఉంద‌ని చెప్పారు. అయితే భారత ఓటరుకు ఆశ్చర్యం కలిగించే సామర్థ్యం ఉంది. ఒక రోజు వారు బీజేపీని కూడా ఆశ్చర్యపరుస్తారు. కానీ ప్రస్తుతం బీజేపీకి వారు కోరుకున్నది ఇచ్చారు.’’ అని తెలిపారు. బీజేపీ ఇంత మెజారిటీతో మరోసారి అధికారంలోకి వస్తుందని చాలా మంది ఊహించలేదని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ (samajwadi party)కి సీట్లు పెరిగాయని చెప్పారు. దీని వల్ల వారు మంచి ప్రతిపక్షం అని నిరూపించుకున్నారని ఆయ‌న అన్నారు. 

యూపీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పనితీరుపై శ‌శి థ‌రూర్ మాట్లాడుతూ.. ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra)పార్టీ కోసం విశేషమైన, శక్తివంతమైన ప్రచారం చేశారని తెలిపారు. నా దృష్టికోణంలో కాంగ్రెస్‌ను ఒక్క వ్య‌క్తి ప్ర‌చారం వ‌ల్ల కాంగ్రెస్ ను త‌ప్పు ప‌ట్ట‌వ‌చ్చ‌ని తాను అనుకోవ‌డం లేద‌ని తెలిపారు. గత 30 ఏళ్లుగా త‌మ ఉనికి ఒక క్రమపద్ధతిలో తగ్గిపోతున్న కొన్ని రాష్ట్రాల్లో పార్టీకి, దాని మనుగడకు సంబంధించిన సమస్యలు చాలా పెద్దవిగా ఉన్నాయని తాను భావిస్తున్నాని తెలిపారు. జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 2022లో పాల్గొనేందుకు శ‌శి థ‌రూర్ ఆదివారం జైపూర్ కు వచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో ముచ్చ‌టించారు.