కృష్ణ పూజారిగా ముంబైలో పనిచేస్తూ తోటి పూజారులతో కలిసి నివాసముండేవాడు. లాక్డౌన్ సడలిస్తే తన స్వస్థలమైన ఉడుపీకి వెళదామని పూజారి కృష్ణ భావించాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి పట్టణానికి చెందిన కృష్ణ ముంబై నగరంలోని కండివలీలోని దుర్గామాత దేవాలయంలో పూజారిగా పనిచేసేవాడు. కృష్ణ పూజారిగా ముంబైలో పనిచేస్తూ తోటి పూజారులతో కలిసి నివాసముండేవాడు. లాక్డౌన్ సడలిస్తే తన స్వస్థలమైన ఉడుపీకి వెళదామని పూజారి కృష్ణ భావించాడు.
అయితే అనూహ్యంగా లాక్డౌన్ ను మే 3వతేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధాని ప్రకటించిన తర్వాత ఆందోళన చెందిన పూజారి కృష్ణ వంటగదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పూజారి ఎలాంటి సూసైడ్ నోట్ రాయలేదు. పోలీసులు పూజారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
