Presidential election 2022: ప్ర‌స్తుతం బీజేపీ రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. మ‌హారాష్ట్ర రాజ‌కీయంతో పాటు.. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో గిరిజ‌నురాలు అంటూ  రాష్ట్రపతి అభ్యర్థిత్వంతో క్రమంలో బీజేపీ తీరుపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది.  

presidential election 2022: ఎన్డీయే అధ్యక్ష పదవికి ఎంపికైన ద్రౌపది ముర్ము గిరిజన నేపథ్యాన్నిప‌దేప‌దే ప్ర‌స్తావిస్తున్న భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) పై కాంగ్రెస్ పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించింది. భారత రాష్ట్రపతి పదవి సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను ప్రతిబింబిస్తుందని కాంగ్రెస్ గురువారం పేర్కొంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా రాష్ట్రపతి ఎన్నిక ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ కాదని, రెండు ఆలోచనల మధ్య పోటీ అని నొక్కి చెప్పింది. గురువారం AICC బ్రీఫింగ్‌లో కాంగ్రెస్ ప్రతినిధి గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ..ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఆలోచనలు మరియు విధానం భారతదేశాన్ని ఆర్థిక ప్రమాదంలోకి నెడుతున్న‌ద‌ని అన్నారు. అలాగే, బీజేపీ పాల‌న‌లో జాతీయ భద్రత, ఆర్థిక, సామాజిక భద్ర‌తా ప్ర‌మాదంలో ప‌డుతున్న‌ద‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే సంబంధిత విష‌యాల‌ను భార‌త ప్ర‌జానీకం చూస్తున్న‌ద‌ని పేర్కొన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ అంశాలన్నీ కీల‌కంగా ఉంటాయ‌ని తెలిపారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

మహిళా సాధికారత మరియు షెడ్యూల్డ్ తెగల సాధికారతను పేర్కొంటూ రాష్ట్రపతి పదవికి ద్రౌప‌ది ముర్ముకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని బీజేపీ నాయ‌కుడు గిరిరాజ్ సింగ్ కోరడంపై అడిగిన ప్రశ్నకు గొగోయ్, రాష్ట్రపతి పదవి అన్ని కులాలు మరియు వర్గాలను ప్రతిబింబిస్తుందని అన్నారు. రాష్ట్రపతి పదవి కంటే గిరిజనులతో ముడిపెట్టడమే బీజేపీ రాజకీయ ఉద్దేశ్యమైతే, వారు దాని గురించి ఆలోచించాలని ఆయన అన్నారు. భారత రాష్ట్రపతి పదవి అనేది భారతదేశంలోని ప్రతి సంఘం, కులం మరియు తెగల వైవిధ్యం మరియు ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించే అత్యంత గౌరవనీయమైన పదవి అని గొగోయ్ తెలిపారు. ద్రౌప‌ది ముర్ము అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తూ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా విలేకరులతో మాట్లాడుతూ, తూర్పు ప్రాంతం నుండి గిరిజన మరియు మహిళ అయిన ఒకరిని ఎంచుకోవడానికి ముందు పార్టీ నాయకత్వం సుమారు 20 మంది పేర్లను ఈ పదవికి చర్చించిందని చెప్పారు. 

కాగా, మరోవైపు.. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా బరిలోకి దిగిన యశ్వంత్ సిన్హా (yashwant sinha) మాట్లాడుతూ.. రాష్ట్రపతి రేసులో ఉన్న ద్రౌపది ముర్ముపై తనకు ఎంతో గౌరవం ఉందని, అయితే పోటీ ఇద్దరు వ్యక్తుల మధ్య కాదని, వ్యతిరేక భావజాలాల మధ్య పోరు అని అన్నారు. గత ఏడాది మార్చిలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) నుండి వైదొలిగి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి)లో చేరిన సిన్హా ముర్ముకు ఎన్నికలలో శుభాకాంక్షలు తెలిపారు. తొలిసారి గిరిజన అభ్యర్థిని గెలిపించాలంటూ త‌న‌పై ఒత్తిడి తెస్తున్న వారికి, దేశ దిశను సరిదిద్దే విషయానికి వస్తే.. ఈ సమస్యలు చిన్నబోతాయని వారికి చెప్పాలనుకుంటున్నానని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పాల్గొనకున్నా.. తమకు అనుకూలంగా ఉండే నాయకులపై ఒత్తిడి తేవాలని దేశ ప్రజలకు నేను చెప్పాలనుకుంటున్నానని యశ్వంత్ సిన్హా అన్నారు. వ్యతిరేక భావజాలాల గురించి తన అభిప్రాయాన్ని వివరిస్తూ.. ఒకరు రాజ్యాంగాన్ని అడ్డుకోవడంలో నరకయాతన పడుతున్నారని, దేశ అధ్యక్షుడికి పని చేయడానికి తన స్వంత మనస్సు ఉండకూడదని, రబ్బర్ స్టాంప్‌గా పనిచేయాలని నమ్ముతున్నాడని అన్నారు.