రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు సర్జరీ
రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్లో కాటరాక్ట్ సర్జరీ జరిగింది. ఈ ఆపరేషన్ విజయవంతంగా ముగిసిందని, అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అయినట్టు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు కంటి ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ విజయవంతమైనట్టు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్(రిఫరల్, రీసెర్చ్)లో కాటరక్ట్ సర్జరీ జరిగినట్టు తెలిపింది. ఆపరేషన్ సక్సెస్ అయిందని, అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అయినట్టు వివరించింది.
‘భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఈ రోజు(ఆగస్టు 19) ఉదయం ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్లో కాటరక్ట్ సర్జరీ జరిగింది. సర్జరీ విజయవంతంగా ముగిసింది. అనంతరం హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అయ్యారు’ అని ఆ ప్రకటన వివరించింది.
75ఏళ్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఛాతిలో సమస్యతో మార్చి నెలలో ఈ హాస్పిటల్కు వెళ్లిన సంగత తెలిసిందే. తర్వాత కూడా పలుసార్లు రోటీన్ టెస్టుల కోసం ఈ హాస్పిటల్ సందర్శించారు.