పార్లమెంట్ ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం: ముఖ్యాంశాలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగించారు.
ఆ ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
* స్టాట్యూ ఆఫ్ యూనిటీ ద్వారా సర్దార్ పటేల్కు నివాళి
* కర్తార్పూర్ కారిడార్ నిర్మాణంతో చరిత్ర సృష్టించాం
* స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గౌరవిస్తున్నాం
* కొత్త రక్షణ ఒప్పందాలు దేశ భద్రత కోసమే
* రాఫెల్ యుద్ధ విమానాల రాకతో మన సరిహద్దులు మరింత సురక్షితం
* విదేశాల్లో చిక్కుకుపోయిన 2 లక్షల 20 వేల మందికి పైగా భారతీయుల్ని క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చాం
* ఈశాన్య భారతావని అంతటా వేగంగా అభివృద్ధి పనులు
* ఈశాన్య రాష్ట్రాల రాజధానులను కలిపేలా రైల్వే నెట్వర్కింగ్ విస్తరణ
* రాష్ట్రాలకు మరిన్ని నిధులు కేటాయించాం
* ఈ ఏడాది కుంభమేళాలో ప్రపంచస్థాయి వసతులు కల్పించాం
* గంగానది ప్రక్షాళకు కృషి చేస్తున్నాం
* సర్జికల్ స్ట్రైక్స్తో ఉగ్రవాదుల పీచమణిచాం
* దేశరక్షణ విషయంలో రాజీపడటం లేదు
* మనీలాండరింగ్ చట్టాన్ని కఠినతరం చేశాం
* నోట్ల రద్దు కీలకమైన నిర్ణయం
* డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పేరుతో అందరికీ బ్యాంకింగ్ సేవలు
* జీఎస్టీతో వ్యాపార లావాదేవీలను పారదర్శకం చేశాం
* ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్లో కీలక మార్పులు తెచ్చాం
* మిషన్ గగన్యాన్ విజయవంతమవుతుందని ఆశీస్తున్నా
* వంద నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ది చేస్తున్నాం
* ఉడాన్ పథకంతో సామాన్యులకు సైతం విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాం
* చిన్న నగరాల్లో సైతం పాస్పోర్ట్ కేంద్రాలు ఏర్పాటు చేశాం
* దేశవ్యాప్తంగా పలు చోట్ల ఎయిమ్స్ నిర్మాణాలు
* రైతుల ఉత్పత్తులకు మంచి ధర కల్పించడం మా లక్ష్యం
* వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్ధతు ధరను రెట్టింపు చేశాం
* పంటలకు బీమా రక్షణ కల్పిస్తున్నాం
* వాజ్పేయ్ పాలన తర్వాత సంక్షేమ పథకాలు మరుగునపడ్డాయి
* ధరలను పెరుగుదలను నియంత్రించాం
* పేదలకు మేలు చేసే విధంగా పలు సంస్కరణలను తెస్తున్నాం
* దేశంలోని అన్ని కుటుంబాలకు బ్యాంకు సేవలు అందుబాటులోకి తెచ్చాం
* జన్ధన్ యోజనతో ఖాతాలతో ప్రభుత్వం, పౌరుల మధ్య అడ్డుగోడలు తొలగాయి
* మహిళా సాధికారకతకు కట్టుబడి ఉన్నాం
* చారిత్రాత్మక ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకొచ్చాం
* ముద్రా యోజనతో రూ. 7 లక్షల కోట్ల రుణాలిచ్చాం
* న్యాయబద్ధంగా వచ్చిన వారందరికీ భారత పౌరసత్వం ఇచ్చాం
* కాపలా లేని రైల్వే క్రాసింగ్లను త్వరలో ఎత్తివేస్తాం
* క్రీడల్లో భారత్ రాణిస్తోంది.. క్రీడాకారులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తాం
* పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలిస్తున్నాం
* దేశంలోని గ్రామ పంచాయతీలన్నింటకీ డిజిటల్ సేవలు అందిస్తున్నాం
* అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్లు
* ఉజ్వల్ యోజన కింద రూ. 6 కోట్ల గ్యాస్ కనెక్షన్లు మంజూరు
* 50 జిల్లాల్లో రూ.4900 కోట్లతో ఆసుపత్రుల నిర్మాణం
* జన్ధన్ యోజనతో 34 కోట్ల మందికి బ్యాంక్ ఖాతాలు
* నల్లధనాన్ని నిర్మూలించాం, అవినీతిని అడ్డుకున్నాం
* ప్రధాని బీమా యోజనతో 21 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు
* దివ్యాంగులకు సమాన ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం
* బాలికలపై అత్యాచారాలు చేసే వాళ్లకు ఉరిశిక్ష విధించేలా చట్టం చేశాం
* స్టార్టప్ ఇండియాతో పరిశ్రమలు స్థాపించే యువతను ప్రోత్సహిస్తున్నాం
* అన్ని రంగాల్లో బాలికలు ముందంజలో ఉన్నారు
* ముద్రా రుణాల్లో అత్యధిక శాతం మహిళలకే దక్కాయి
* సైన్యంలోనూ మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తున్నాం
* గ్రామీణ ఆవాస్ యోజన కింద కోటికి పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాం
* ప్రతి పౌరుడి జీవితంలో వెలుగు నింపే ప్రయత్నం చేస్తున్నాం
* 50 కోట్ల మందికి ఆరోగ్య బీమా అమలు చేస్తున్నాం
* ప్రతి ఇంటికీ విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నాం
* వాజ్పేయి హయాంలో అనేక కొత్త కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి
* దివ్యాంగుల కోసం రైల్వే స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశాం
* నవ భారత నిర్మాణానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది
* నిరుపేదలకు సైతం విద్యుత్, వంటగ్యాస్ను అందుబాటులోకి తెచ్చాం
* మరుగుదొడ్ల నిర్మాణంతో మహిళల గౌరవాన్ని పెంచాం. దేశంలో మొత్తం 9 కోట్ల మరుగుదొడ్లు నిర్మించాం.
* ఆయుష్మాన్ భారత్ పథకంతో నిరుపేదలకు మెరుగైన వైద్యంతో పాటు వైద్య ఖర్చులను తగ్గించాం
* అంబేద్కర్, గాంధీ సిద్ధాంతాలను అనుసరించి పనిచేస్తున్నాం
* తల్లీ, సోదరీమణులకు ఉజ్వల్ యోజన ప్రయోజనాలు
* హృద్రోగులకు ఉపయోగించే స్టంట్ల ధరలను తగ్గించాం
* 50 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అమలు చేస్తున్నాం
* అవినీతి నుంచి భారత్ను విముక్తి చేయాలని చూస్తున్నాం.
* మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం
* 2019 భారతదేశానికి అత్యంత కీలకమైన సంవత్సరం
* కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేదలందరికీ అందుతున్నాయి