రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాటరాక్ట్ సర్జరీ..
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాటరాక్ట్ సర్జరీ (కంటి శుక్లం శస్త్రచికిత్స) జరిగింది. న్యూఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ (రీసెర్చ్ అండ్ రిఫరల్)లో ఈ సర్జరీ నిర్వహించారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాటరాక్ట్ సర్జరీ (కంటి శుక్లం శస్త్రచికిత్స) జరిగింది. న్యూఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్ (రీసెర్చ్ అండ్ రిఫరల్)లో ఈ సర్జరీ నిర్వహించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ ప్రతినిధి వివరాలను వెల్లడించారు. సర్జరీ విజయవంతంగా జరిగిందని.. ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇక, ద్రౌపది ముర్ము ఈ ఏడాది జూలై 25న భారతదేశ 15వ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.