12 సెంట్రల్ యూనివర్శిటీలకు కొత్త వీసీలు: హైదరాబాద్ వర్సిటీకి బిజె రావు
దేశంలోని 12 సెంట్రల్ యూనివర్శిటీలకు వీసీలను రాష్ట్రపతి నియమించారు.ఈ మేరకు శుక్రవారం నాడు ప్రెసిడెంట్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంకా 10 యూనివర్శిటీల వీసీ పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది.
న్యూఢిల్లీ: దేశంలో 12 సెంట్రల్ యూనివర్శిటీలకు వీసీలను నియమించారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. ఈ మేరకు శుక్రవార నాడు ఆయన ఉత్తర్వులు జారీ చేశారు.దేశంలోని 22 వీసీ పోస్టుల్లో ప్రస్తుతం 12 పోస్టులను భర్తీ చేశారు. యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పోస్టులను భర్తీ చేశారు.
హైద్రాబాద్ :బస్త్కర్ జె.రావు
హర్యానా:తనికేశ్వర్ కుమార్
హిమాచల్ప్రదేశ్:'సత్ప్రకాష్ బన్సాల్
జమ్మూ:సంజీవ్ జైన్
జార్ఖండ్:క్షిట్టి భూషన్ దాస్
కర్ణాటక:బట్టు సత్యనారాయణ
తమిళనాడు:ముత్తుకళింగన్ కృష్ణన్
బీహార్:కామేశ్వర్ నాథ్ సింగ్
నార్త్హిల్ యూనివర్శిటీ: ప్రభాశంకర్ శుక్లా
గురుగసిదాస్: అలోక్ కుమార్ చక్రవాల్
మౌలానా ఆజాద్ యూనివర్శిటీ:సయ్యద్ ఐనాల్ హసన్
మణిపూర్ యూనివర్శిటీ: ఎన్. లోకేందర్ సింగ్
జేఎన్టీయూ, డీయూతో సహా మొత్తం 10 విశ్వవిద్యాలయాలకు వీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.ఖాళీగా ఉన్న 10 యూనివర్శిటీల వీసీ పోస్టులను కూడ భర్తీ చేసే అవకాశాలున్నాయని సమాచారం.