ఎఫ్ఆర్ మైఖేల్కు పీఆర్సీఐ హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు
పీఆర్సీఐ హాల్ ఆఫ్ ఫేమ్ ప్రెస్టీజియస్ అవార్డు సీనియర్ పీఆర్వో (రిటైర్డ్) ఎఫ్ఆర్ మైఖేల్కు దక్కింది. బెంగాల్ మంత్రి షోభాందేబ్ ఛటోపాద్యాయ్ ఈ అవార్డును అందించార.
న్యూఢిల్లీ: సీనియర్ పీఆర్వో (రిటైర్డ్) ఎస్సీఆర్, డైరెక్టర్ పీఆర్సీఐ, నేషనల్ ఎగ్జిక్యూటివ్ ఎఫ్ఆర్ మైఖేల్కు పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా హాల్ ఆఫ్ ఫేమ్ ప్రెస్టీజియస్ అవార్డు దక్కింది. బెంగాల్ వ్యవసాయ మంత్రి షోభాందేబ్ ఛటోపాద్యాయ్ ఈ అవార్డును ఎఫ్ఆర్ మైఖేల్కు అందించారు. పీఆర్సీఐ చీఫ్ మెంటర్, చైర్మన్ ఎమిరిటస్ ఎంబీ జయరాం, పీఆర్సీఐ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ టీ వినయ్ కుమార్ల సమక్షంలో ఈ అవార్డు ప్రదానం చేశారు.
నవంబర్ 11వ తేదీన కోల్కతాలో నిర్వహించిన 16వ పీఆర్సీఐ గ్లోబల్ కాంక్లేవ్లో ఎఫ్ఆర్ మైఖేల్కు ఈ అవార్డును ప్రదానం చేశారు. పీఆర్ వృత్తిలో ఆయన చేసిన విశేష కృషికి గాను ఈ అవార్డును ప్రదానం చేశారు. కోల్కతాలోని మేరియట్ ఫెయిర్ఫీల్డ్లో నిర్వహించిన ఫంక్షన్లో సత్కారం జరిగింది. పీఆర్ ప్రొఫెషన్లో ప్రముఖమైన పాత్ర పోషించిన మీడియా ప్రొఫెషనల్స్కు, పీఆర్ సేవలు అందించిన వారికి నేషనల్ పీఆర్సీఐ ఎక్స్లెన్స్ అవార్డులు ప్రదానం చేస్తారు.