సీఎం రేసులో ఆ ముగ్గురు.. ఉత్కంఠ భరితంగా హిమాచల్ప్రదేశ్ రాజకీయాలు..
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారర బీజేపీని ఓడించి.. స్పష్టమైన మెజారిటీ సాధించి..రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులేసుంది కాంగ్రెస్. అయితే.. ముఖ్యమంత్రి ఎవరన్నది ఉత్కంఠ మారింది. సీఎం రేసులో హిమాచల్ కాంగ్రెస్ చీఫ్, మాజీ సీఎం వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్, సీఎల్పీ నేత, విపక్ష నేత ముఖేష్ అగ్నిహోత్రి, ప్రచార కమిటీ చీఫ్ సుఖ్విందర్ సింగ్ సుఖు సీఎం రేసులో నిలిచారు. వీరితోపాటు పలువురి ఇతర నేతలు కూడా సీఎం పీఠంపై మనసు పారేసుకున్నారు.
హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. దీంతో ఆ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించింది. అయితే.. ముఖ్యమంత్రి ఎవరు అనేది ప్రధాని సమస్యగా మారింది. ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోకముందే కాంగ్రెస్లో వర్గపోరు మొదలైంది. ముఖ్యమంత్రి పదవి కోసం పలువురు నేతలు ముందుకు వచ్చారు. ఎంతో మంది ఆ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రిని నిర్ణయించేందుకు నేడు సిమ్లాలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరగనుంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం రాజీవ్ భవన్లో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరగనుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ రాజీవ్ శుక్లా, పరిశీలకులు భూపేష్ బఘేల్, భూపేంద్ర సింగ్ హుడా కూడా పాల్గొంటారు. హిమాచల్ కాంగ్రెస్ చీఫ్, మాజీ సీఎం వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్, సీఎల్పీ నేత, విపక్ష నేత ముఖేష్ అగ్నిహోత్రి, ప్రచార కమిటీ చీఫ్ సుఖ్విందర్ సింగ్ సుఖు సీఎం రేసులో నిలిచారు.
ఈ సమావేశంలో ప్రధానంగా నూతన ముఖ్యమంత్రి పేరును ఖరారు చేసే అవకాశం ఉంది. పార్టీని ముందుకు తీసుకెళ్ళి నిలదొక్కుకునే నాయకుడిని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం కాంగ్రెస్కు సవాల్ గా మారింది.అయితే.. ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో? ఎవరిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారో వేచి చూడాలి.
హిమాచల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ప్రతిభా సింగ్ కీలక పాత్ర పోషించింది . అయితే.. ఆమె అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయినప్పటికీ ఆమె సీఎంలో నిలిచారు. ఆమె ఎమ్మెల్యేగా ఎన్నిక కాకపోయినా.. పార్టీ గెలుపులో ఆమె క్రుషి ఎంతగానో ఉంది. ఆమె రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కోసం విస్తృతంగా ప్రచారం చేసింది. ప్రస్తుతం ఆమె మండి ఎంపీగా వ్యవహరిస్తున్నారు. ఆమె పదవీ విరమణ చేసిన ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ సొంత జిల్లా మండి నుండి లోక్సభ ఉప ఎన్నికలో విజయం సాధించారు. ప్రతిభా సింగ్తో పాటు, నాలుగు దశాబ్దాలకు పైగా రాష్ట్రంలో కాంగ్రెస్ను నడిపించిన మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ వారసత్వం కూడా ఉంది. దీంతో ఆమెనే ముందుంటారని చెబుతున్నారని పలువురు భావిస్తున్నారు.
అలాగే..పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సుఖ్వీందర్ సింగ్ సుఖు, ప్రస్తుత అసెంబ్లీలో కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడు ముఖేష్ అగ్నిహోత్రి కూడా రేసులో ఉన్నట్టు సమాచారం. అదే సమయంలో రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కుల్దీప్ సింగ్ రాథోడ్ కూడా ముఖ్యమంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నట్టు తెలుస్తుంది. నాదౌన్ ఎమ్మెల్యే సుఖు, హరోలి ఎమ్మెల్యే అగ్నిహోత్రి కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడిగా మరియు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా తమ పనిని పార్టీ హైకమాండ్ ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకుంటుందని ఇద్దరూ భావిస్తున్నారు. అగ్నిహోత్రి బ్రాహ్మణ నాయకుడు కాగా, సుఖు రాష్ట్రంలోని ఆధిపత్య ఠాకూర్ వర్గానికి చెందినవాడు. మరోవైపు, గత కొన్నేళ్లుగా ఫ్యాక్షనిజంతో పోరాడుతూ పార్టీని ఏకం చేశానని కుల్దీప్ సింగ్ రాథోడ్ చెబుతున్నారు.
హిమాచల్లో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకపోవడం గమనార్హం. ఏ ముఖం పెట్టుకోకుండానే కాంగ్రెస్ ఎన్నికల బరిలోకి దిగింది. ఇప్పుడు హిమాచల్కు మెజారిటీ రావడంతో హిమాచల్ కాంగ్రెస్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీ అధిష్టానం ఎవరిని ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటారో వేచి చూడాలి.