PFI: పీఎఫ్ఐ ఫై నిషేధం.. గోవాలో 29 మంది అరెస్టు
Goa police: ఉగ్రవాద, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) నాయకులు, సిబ్బంది ఇండ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించాయి. ఈ క్రమంలోనే కేంద్రం దీనిపై నిషేధం వించింది.
Popular Front of India: కేంద్ర ప్రభుత్వం పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై నిషేధం విధించిన తర్వాత ఆ సంస్థకు చెందిన 29 మంది సభ్యులను గోవా పోలీసులు అరెస్టు చేసినట్టు ఒక అధికారి తెలిపారు. ఈ సభ్యులను కోర్టులో హాజరుపరిచామనీ, వ్యక్తిగత బాండ్లపై విడుదల చేయాలని ఆదేశించిందని చెప్పారు. ఐఎస్ఐఎస్ వంటి గ్లోబల్ టెర్రర్ గ్రూపులతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో పీఎఫ్ఐ, దాని సహచరులలో చాలా మందిని ఐదేళ్లపాటు కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేంద్రం నిషేధించింది. "పీఎఫ్ఐపై నిషేధం తర్వాత, రాష్ట్రంలో మొత్తం 29 మంది సంస్థ సభ్యులను అరెస్టు చేశారు. వారిలో ఎక్కువ మంది దక్షిణ గోవాకు చెందినవారు" అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. వారందరినీ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచామన్నారు. వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
అరెస్టయిన పిఎఫ్ఐ సభ్యులలో ఇద్దరు వాస్కో, నవేలిమ్లోని వారి వారి ప్రాంతాలలో రాజకీయంగా చురుకుగా ఉన్నారని అధికారి తెలిపారు. స్థానిక నిఘా ఇన్పుట్ల ఆధారంగా నిషేధిత సంస్థ సభ్యులు, కార్యాలయాలపై దాడులు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.
పీఎఫ్ఐ పై ఐదేండ్ల నిషేధం
ఉగ్రవాద, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) నాయకులు, సిబ్బంది ఇండ్లు, కార్యాలయాలపై దాడులు నిర్వహించాయి. ఈ క్రమంలోనే కేంద్రం పీఎఫ్ఐ పై నిషేధం వించింది. మంగళవారం అర్థరాత్రి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన టిఫికేషన్లో, పీఎఫ్ఐ (PFI) వ్యవస్థాపక సభ్యులు స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా (SIMI) నాయకులనీ, PFI జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్ (JMB)తో సంబంధాలు కలిగి ఉందని పేర్కొంది. JMB, SIMI రెండూ నిషేధించబడిన సంస్థలుగా ఉన్నాయని పేర్కొంది. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) వంటి గ్లోబల్ టెర్రరిస్టు గ్రూపులతో పిఎఫ్ఐకి అంతర్జాతీయ సంబంధాలు ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయని కూడా పేర్కొంది.
దేశవ్యాప్తంగా పీఎఫ్ఐపై దర్యాప్తు సంస్థల దాడులు
ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థలు పీఎఫ్ఐ కి చెందిన కార్యాలయాలు, సంబంధిత అధికారులు, సన్నిహితుల ఇండ్లపై దాడులు నిర్వహించింది. ఈ క్రమంలోనే వందల మంది అరెస్టు చేసి.. ఈ కేసును విచారణ జరుపుతోంది. ఈ నెలలో వారిపై దేశవ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో అరెస్టయిన కొంతమంది పీఎఫ్ఐ అగ్రనేతలు, ఆఫీస్ బేరర్ల ప్రొఫైల్లు వివరాలు కొన్ని ఇలా ఉన్నాయి..
1. OMA సలామ్, పీఎఫ్ఐ-చైర్మన్ : పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) చైర్మన్ ఆయన సలామ్, కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ లో ఉద్యోగిగా కొనసాగుతున్నారు. ఈ ఉద్యోగి, PFIతో సంబంధాల కారణంగా "సస్పెండ్" చేయబడ్డారు, శాఖాపరమైన విచారణను ఎదుర్కొంటున్నారు. PFI ఫ్రంట్ అని ఆరోపించబడిన రిహాబ్ ఇండియా ఫౌండేషన్ (RIF)తో కూడా సంబంధం కలిగి ఉన్నాడని సమాచారం.
2. అనిస్ అహ్మద్, జాతీయ ప్రధాన కార్యదర్శి : బెంగుళూరులో చదువుకున్న అహ్మద్ సైబర్ కార్యకలాపాలు, పీఎఫ్ఐ ఉనికిని విస్తరించడంలో ముఖ్యమైన నాయకుడు. అతను ఇటీవల సస్పెండ్ చేయబడిన గ్లోబల్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీతో పని చేస్తున్నాడు. సోషల్ మీడియా, వార్తా ఛానెల్లలో ప్రస్తుత సమస్యలపై వ్యాఖ్యలు/ప్రతిస్పందనలు చేయడంలో "ప్రోయాక్టివ్"గా ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.