పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అన్నింటింది ఒకటే అంచనా. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌ ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ అన్నింటింది ఒకటే అంచనా. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌ ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కేజ్రీవాల్ మ్యాజిక్ పంజాబ్ వర్కౌట్ అయిందని చెబుతున్నాయి. పార్టీ ఏర్పడిన పదేళ్ల తర్వాత రెండో రాష్ట్రంలో అధికారం చెపట్టనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెల్లడిస్తున్నాయి. తొలిసారి ఢిల్లీ వెలుపల ఆప్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ ద్వారా తెలుస్తోంది. 

ఇప్పటివరకు ప్రముఖ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కోడికరిస్తే.. మొత్తం 117 స్థానాలు ఉన్న పంజాబ్ అసెంబ్లీలో ఆప్ 66 స్థానాల్లో విజయం సాధించే చాన్స్ ఉంది. కాంగ్రెస్ 28 స్థానాల్లో, బీజేపీ 3 స్థానాల్లో, శిరోమణి అకాలీదళ్20 స్థానాల వరకు గెలుపొందే చాన్స్ ఉందని ఎగ్జిట్ పోల్స్ డేటా చెబుతుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమైతే.. ఆప్ సీఎం అభ్యర్థి Bhagwant Mann ముఖ్యమంత్రి పీఠం వరించే అవకాశం ఉంది.

ఎగ్జిట్ పోల్స్..
ఏబీపీ- సీ ఓటర్‌: బీజేపీ 51-61, కాంగ్రెస్ 22-28, బీజేపీ కూటమి 7-13, శిరోమణి అకాలీదళ్ కూటమి -20- 26
ఇండియా టూడే- యాక్సిస్‌: బీజేపీ 76-90, కాంగ్రెస్ 19-31, బీజేపీ కూటమి 1-4, శిరోమణి అకాలీదళ్ కూటమి - 7-11
జీ న్యూస్‌: బీజేపీ 52-61, కాంగ్రెస్ 26-33, బీజేపీ కూటమి 52-61, శిరోమణి అకాలీదళ్ కూటమి -24-32
టైమ్స్ నౌ-Veto: బీజేపీ 70, కాంగ్రెస్ 22, బీజేపీ కూటమి 5, శిరోమణి అకాలీదళ్ కూటమి -19
న్యూస్ ఎక్స్: బీజేపీ 56-61, కాంగ్రెస్ 24-29, బీజేపీ కూటమి 1-6, శిరోమణి అకాలీదళ్ కూటమి -22-26

ఇక, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే ఇక్కడ ఫిబ్రవరి 20వ తేదీన ఒకే దశలో మొత్తం 117 స్థానాలకు పోలింగ్ జరిగింది. మొత్తం 2.14 కోట్ల ఓటర్లు ఉండగా.. 72 శాతం పోలింగ్ నమోదైనట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే ఇది 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నమోదైన పోలింగ్ శాతంతో పోలిస్తే తక్కువగా ఉంది. పంజాబ్‌లో 2017లో 77.4 శాతం పోలింగ్ నమోదైంది. 

పంజాబ్‌లో మొత్తం 117 శాసనసభ స్థానాలు ఉండగా.. ఎన్నికల బరిలో మొత్తం 1,304 అభ్యర్థులు నిలిచారు. అయితే వీరిలో కేవలం 93 మంది మాత్రమే మహిళలు ఉండటం గమనార్హం. ఇక, పంజాబ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారన్ని నిలుపుకోవాలని చూస్తోంది. పంజాబ్‌లో వరుసగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ఎస్​ఏడీ బీజేపీ కూటమిని 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఓడించిం అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్​ 77 సీట్లలో, ఆప్​ 20 చోట్ల గెలిచింది. ఎస్​ఏడీ–బీజేపీ కూటమి 18 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయితే కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత పరిణామాలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. 

2017 అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆమ్‌ ఆద్మీ పార్టీ.. ఈసారి పంజాబ్ పీఠాన్ని దక్కించుకోవాలని ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగానే ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్.. పంజాబ్‌‌పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇక, సాగు చట్టాల విషయంలో బీజేపీకి దూరం జరిగిన ఎస్‌ఏడీ.. ఈ ఎన్నికలల్లో బీఎస్పీతో జట్టు కట్టింది. ఇక, బీజేపీ.. మాజీ సీఎం అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్, సుఖ్‌దేవ్ సింగ్ నేతృ‌త్వం‌లోని ఎస్‌‌ఏడీ (సం‌యు‌క్త)తో కలిసి బరి‌లోకి దిగింది.

పంజాబ్ ఎన్నికల బరిలో.. ప్రస్తుతం సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ.. చౌమ్‌కౌర్ సాహిబ్, Bhadaur రెండు స్థానాల నుంచి బరిలో ఉన్నారు. పంజాబ్​ కాంగ్రెస్​ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్దూ.. అమృత్‌సర్ ఈస్ట్, మాజీ సీఎం అమరీందర్ సింగ్.. పటియాలా, శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్.. జలాలాబాద్, ఆప్​ సీఎం అభ్యర్థి Bhagwant Mann.. ధురి, మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్.. లాంబి, పంజాబ్​ బీజేపీ చీఫ్​ అశ్వనీ శర్మ.. పఠాన్‌కోట్ స్థానాల నుంచి ఎన్నిక బరిలో నిలిచారు. ఇక, మార్చి 10వ తేదీన పంజాబ్‌తో పాటు మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.