ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో  మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్‌లను ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన తర్వాత అతీక్ అహ్మద్ భార్య షైస్తా పర్వీన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ అహ్మద్‌లను ఏప్రిల్ 15వ తేదీన ముగ్గురు వ్యక్తులు పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపిన ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన తర్వాత అతీక్ అహ్మద్ భార్య షైస్తా పర్వీన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆమె ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. పలు రాష్ట్రాల్లో కూడా సోదాలు చేపట్టారు. షైస్తా పర్వీన్‌తో పాటు ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులుగా ఉన్న మరో ముగ్గురు గుడ్డు ముస్లిం, సాబీర్, అర్మాన్ కూడా పరారీలో ఉన్నారు. 

పోలీసు వర్గాల సమాచారం ప్రకారం..గ్రేటర్ నోయిడా, మీరట్, ఢిల్లీ, ఓఖ్లా, పశ్చిమ బెంగాల్‌లోని ప్రదేశాలలో షైస్తా పర్వీన్ కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. 
షైస్తా పర్వీన్‌కు సహాయం చేసిన 20 మందికి పైగా అనుమానితులను పోలీసులు గుర్తించారు. ఇలా గుర్తించిన వారిలో ఒక మహిళా డాక్టర్‌తో పాటు షైస్తా బంధువులు కూడా ఉన్నారు.

అయితే అతీక్ అహ్మద్ హత్యకు రెండు రోజుల ముందు (ఏప్రిల్ 13) రాష్ట్రంలోని ఝాన్సీ జిల్లాలో యూపీ పోలీసు స్పెషల్ టాస్క్ ఫోర్స్‌తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో అతని మూడో కుమారుడు అసద్ మరణించిన సంగతి తెలిసిందే. అయితే కొడుకు అంత్యక్రియలకు గానీ, భర్త అంత్యక్రియలకు గానీ షైస్తా పర్వీన్ రాకపోవడం పోలీసులను ఆశ్చర్య పరిచింది. ‘‘షైస్తా పర్వీన్‌ ఆచూకీ కనుగొనడానికి, అరెస్టు చేయడానికి పలు టీమ్‌లను ఏర్పాటు చేయబడ్డాయి. ఉమేష్ పాల్ హత్య కేసులో ఆమె ప్రధాన నిందితురాలిగా పేర్కొనబడ్డారు’’అని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ఆమె మూడవ కుమారుడు అసద్ ఏప్రిల్ 13న రాష్ట్రంలోని ఝాన్సీ జిల్లాలో UP పోలీసు స్పెషల్ టాస్క్ ఫోర్స్‌తో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించగా, ఆమె భర్త అతిక్ అహ్మద్ మరియు బావ ఖలీద్ అజీమ్ అకా అష్రఫ్‌ను ముగ్గురు దుండగులు పోలీసు కస్టడీలో కాల్చి చంపారు. ఏప్రిల్ 15న ప్రయాగ్‌రాజ్‌లో.


ఇక, ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లోని వైద్య కళాశాలకు చెకప్ కోసం అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్‌లను పోలీసులు తీసుకెళ్తుండగా దుండగులు వారిపై దాడి చేశారు. దుండగులు జర్నలిస్టులుగా నటిస్తూ ముగ్గురు వ్యక్తులు అతీక్, అష్రఫ్‌లను సమీపంలోకి వచ్చి పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జరిపారు. ఈ నేరానికి పాల్పడిన ముగ్గురు దుండగులు హమీర్‌పూర్‌కు చెందిన మోహిత్ అలియాస్ సన్నీ (23), బందాకు చెందిన లవ్లేష్ తివారీ (22), కస్గంజ్‌కు చెందిన అరుణ్ మౌర్య (18)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి ప్రయాగ్‌ రాజ్‌ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.

నిందితులను సోమవారం ప్రయాగ్‌రాజ్ సెంట్రల్ జైలు నుంచి ప్రతాప్‌గఢ్ జైలుకు తరలించారు. హత్యలపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయబడింది. నిందితులను ప్రతాప్‌గఢ్ జిల్లా జైలుకు తరలించడం పరిపాలనాపరమైన కారణాలతో జరిగిందని అధికారులు చెబుతున్నారు. ప్రయాగ్‌రాజ్ పోలీస్ కమిషనర్ రమిత్ శర్మ ఆదేశాల మేరకు సిట్‌ను ఏర్పాటు చేసినట్లు స్పెషల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత్ కుమార్ పిటిఐకి తెలిపారు. సిట్‌కు క్రైమ్ అదనపు డిప్యూటీ కమిషనర్ సతీష్ చంద్ర నేతృత్వం వహిస్తారు.