Asianet News TeluguAsianet News Telugu

లక్షద్వీప్ లో ప్రధాని మోడీ సాహసాలు.. స్నార్కెలింగ్ చేసి, అందమైన పగడాలు చూసి.. ఫొటోలు రిలీజ్..

లక్షద్వీప్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ మరో సారి సాహసాలను చేశారు. సముద్రం లోపలకు వెళ్లి అందమైన పగడాలు, చేపలకు సంబంధించిన ఫొటోలు తీశారు. వాటిని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. గతంలో కూడా ప్రధాని మోడీ బేర్ గ్రిల్స్ తో కలిసి ప్రధాని మోడీ సాహసాలు చేశారు.

PM Modi's adventures in Lakshadweep..Snorkeling and seeing beautiful corals..Photos released..ISR
Author
First Published Jan 4, 2024, 4:34 PM IST

భారత్ లో అతిచిన్న కేంద్ర పాలిత ప్రాంతమైన లక్షద్వీప్ పర్యటనలో ప్రధాని మోడీ సాహసాలు చేశారు. సముద్రం లోపలికి వెళ్లి అక్కడున్న పగడాలు, చేపలను చూశారు. దానికి సంబంధించిన ఫొటోలను ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్) హ్యాండిల్ లో షేర్ చేశారు. సాహస ప్రియులు ఖచ్చితంగా ఈ ప్రదేశాన్ని తమ లిస్టులో చేర్చుకోవాలని సూచించారు. 

తాను లక్షద్వీప్ పర్యటనలో భాగంగా స్కార్కెలింగ్ చేసేందుకు ప్రయత్నించానని పేర్కొన్నారు. ఇది ఎంతో ఉత్తేజకరమైన అనుభవం అని తెలిపారు. ప్రకృతి అందాలతో పాటు లక్షద్వీప్ ప్రశాంతత కూడా మంత్రముగ్ధులను చేస్తుందని ఆయన అన్నారు. ప్రశాంత వాతావరణం 140 కోట్ల మంది భారతీయుల సంక్షేమం కోసం మరింత కష్టపడటం ఎలాగో ఆలోచించే అవకాశాన్ని ఇచ్చిందని ప్రధాని అన్నారు.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీన సహజమైన బీచ్ ల వెంబడి తన మార్నింగ్ వాక్ కు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశారు. కాగా.. 2019 లో సర్వైవలిస్ట్, సాహసికుడు బేర్ గ్రిల్స్ తో కలిసి చేసిన ప్రయాణానికి సంబంధించిన ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షోను డిస్కవరీ ఛానెల్ ప్రసారం చేసినప్పుడు ప్రపంచం మొదటిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ లో ఉన్న సాహసోపేతమైన కోణాన్ని చూసింది, ఉత్తరాఖండ్ లోని కార్బెట్ నేషనల్ పార్క్ నిర్మానుష్యమైన అరణ్యంలో ఈ షో చిత్రీకరణ జరిగింది.

ఈ షో ప్రసారం కావడానికి ముందు ఎక్స్ లో స్పెషల్ ఎపిసోడ్ కు సంబంధించిన 45 సెకన్ల ప్రోమోను షేర్ చేశారు. ఈ క్లిప్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ప్రధానిలో ఉన్న మరో భిన్నమైన కోణాన్ని ప్రజలు మొదటి సారిగా ఇందులోనే చూశారు. 68 ఏళ్ల వయసున్నమోడీ దూరంగా పరుగెత్తుతున్న పులి, ఏనుగులు, జింకల గుంపు చిత్రాలతో పార్కులోకి వెళ్తూ కనిపించారు. మరో దృశ్యంలో ఆయన తాత్కాలిక ఈటె, తోక కట్టిన తెప్పపై కురుస్తున్న వర్షంలో నదిని దాటుతూ కనిపించారు

ఈ షో అనంతరం ‘ఏఎన్ఐ’ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గ్రిల్స్ మాట్లాడుతూ... ఈ ప్రయాణంలో గ్లోబల్ లీడర్ అయినా ఆయనలోని వినయం తనకు ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని అన్నారు. ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నప్పటికీ.. ఆయన ముఖంలో చిరునవ్వు చెరగలేదని తెలిపారు. 

‘‘ఆయన వినయమే నాకు ప్రకాశవంతంగా మెరిసింది. ఆయన చాలా వినయమైన వ్యక్తి. వర్షం కురుస్తున్నప్పటికీ, సెక్యూరిటీ గొడుగులు పట్టేందుకు ప్రయత్నించారు. కానీ ఆయన ‘‘లేదు.. నేను బాగున్నాను’’ అని చెప్పారు. కొంత సమయం తరువాత మేము ఒక నది వద్దకు చేరుకున్నాము. నాట్లు, టార్పాలిన్ తో తెప్పను తయారు చేశాను. దాని ద్వారా నదిని దాటవచ్చని అనుకున్నాను. కానీ సెక్యూరిటీ దానికి ఒప్పుకోలేదు. ప్రధానిని ఇలాంటి తెప్పలో ప్రయాణించనివ్వలేమని అన్నారు. కానీ ఆయన (మోడీ) తాను బాగానే ఉన్నానని, మేమిద్దరం కలిసి ఈ పని చేస్తామని చెప్పారు. కొంత సమయం తరువాత అది మునిగిపోవడం ప్రారంభించింది. దీంతో నేను ఈత కొడుతూ ఆయనను తోసేసాను, అతడు తడిసిపోయాడు. ఆ వర్షంలో కూడా ఆయన ముఖం పెద్ద చిరునవ్వుతూనే ఉంది’’ అని అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios