Bhagwant Mann: కేంద్రప్ర‌భుత్వంపై పంజాబ్ నూత‌న సీంఎ భగవంత్ మాన్ విరుచుక‌ప‌డుతున్నారు. పంజాబ్ రాష్ట్ర హక్కులను పూర్తిగా కాల‌రాశార‌నీ, పంజాబీల హ‌క్కుల‌ను దోచుకుంటున్నారని ప్ర‌ధాని మోడీ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని, బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలు భార‌తదేశంలో లేన‌ట్టేనా అని ప్ర‌శ్నించారు. 

Bhagwant Mann: చండీగఢ్ ఉద్యోగులకు సెంట్రల్ సర్వీస్ రూల్స్ వర్తిస్తాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల చేసిన ప్రకటనపై రాజకీయ దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్ర‌ధాని మోడీ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పంజాబ్ రాష్ట్ర హక్కులను పూర్తిగా కాల‌రాశార‌నీ, పంజాబీల హ‌క్కుల‌ను దోచుకుంటున్నారని ఆరోపించారు.

పంజాబ్ అసెంబ్లీలో నేడు చండీగఢ్‌ను తక్షణమే పంజాబ్‌కు బదిలీ చేయాలంటూ... సీఎం తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ తీర్మానంపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ఇవాళ ప్రత్యేకంగా ఒక రోజు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన ఎప్పుడూ జరిగినా..రాజధాని మాతృ రాష్ట్రానికే ఉండాల‌ని తీర్మానంలో పేర్కొన్నారు. ప్రజాభీష్టం మేరుకు చండీఘడ్‌ను పంజాబ్‌కు బదిలీ చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్రంతో చర్చలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి అసెంబ్లీ సిఫారసు చేసేలా తీర్మానంలో పేర్కొన్నారు.

ఈ సంద‌ర్బంగా.. సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ.. భారతదేశానికి విముక్తి కల్పించడంలో పంజాబ్ ప్రజలు 80 శాతం త్యాగాలు చేశారని అన్నారు. అలాంటి .. పంజాబీ హ‌క్కుల‌ను భారత ప్రధాని మోడీ దోచుకుంటున్నారని ఆరోపించారు. పార్లమెంటేరియన్‌గా తన గత అనుభవాన్ని పంచుకుంటూ.. రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేలందరినీ స్వార్థ ప్రయోజనాలు, వ్యక్తిగత ప్ర‌యోజ‌నాలు విడిచి.. తమ రాష్ట్రాల హక్కులను కాపాడుకోవడానికి దక్షిణాది రాష్ట్రాల నాయకులు ప్రదర్శించే.. ఐక్యత, ఉద్య‌మ స్ఫూర్తిని ప్రదర్శించాలని ఉద్బోధించారు. 

కేరళ, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల ఎంపీలు తమ సమస్యలను పార్లమెంట్‌లో లేవనెత్తేందుకు ఏవిధంగా ఏకమ‌వుతారో.. చూసి నేర్చుకోవాల‌ని అన్నారు. మనం ఎందుకు కలిసి ముందుకు వెళ్ల‌లేక‌పోతున్నామా? అనిపిస్తుండేదనీ, ద‌క్షిణాది రాష్ట్రాల రాజ‌కీయ పంథా వేరుగా ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు. కేంద్రంపై విరుచుకుపడుతూ.. బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని, ముఖ్యంగా పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ నాయకత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. అదే స‌మ‌యంలో బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలు.. దేశంలో భాగం కాదా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు.

పంజాబ్ సెంట్రల్ పూల్ నుండి అదనపు విద్యుత్తును డిమాండ్ చేసిందని, అయితే దానిని తిరస్కరించారని, అయితే, దానిని హర్యానాకు ఇచ్చారని సీఎం మాన్ అన్నారు. మరోవైపు.. 'సబ్కా సాథ్ సబ్‌కా వికాస్ అంటూ.. ప్ర‌ధాని నినాదిస్తున్నార‌నీ, కానీ, స‌బ్కా వికాస్ ఎక్కడ ఉంద‌ని నిలదీశారు. 2016లో పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై జరిగిన ఉగ్రదాడి తర్వాత సైన్యాన్ని పంపినందుకు పంజాబ్‌ను ₹ 7.50 కోట్లు చెల్లించాలని కేంద్రం కోరిందని ఆయన గుర్తు చేశారు. మిలిటరీని పంజాబ్‌కు అద్దెకు ఇచ్చారా? అని అప్పటి ఎంపీ సాధు సింగ్‌తో పాటు రక్షణ మంత్రిని అడిగానని మన్ చెప్పారు. పంజాబ్‌ను దేశంలో ఒక భాగంగా పరిగణించరా? అని ప్ర‌శ్నించారు.

ఈ తీర్మానం యొక్క ఉద్దేశ్యం తెలుసుకోకుండా.. బీజేపీ నేత‌లు విమ‌ర్శించ‌రాద‌ని సూచించారు. తాను 'నాగ్‌పురి సంత్రే' (నాగ్‌పూర్ నారింజలు) గురించి చాలా విన్నాననీ. కానీ, మొదటిసారిగా 'నాగ్‌పురి భాష్' (చిరునామా) వింటున్నాను. వారు నేరుగా నాగ్‌పూర్ నుండి చిరునామాను పొందారని బీజేపీ నేత అశ్వనీ శర్మను ఎద్దేవా చేశారు. పంజాబ్‌లో నివసిస్తున్నారు. పంజాబ్ ఆహారం తింటారు. పంజాబ్ నీరు తాగుతారు. ఆపై మీరు వద్దు, కాదు అని తీర్మానానికి మద్దతు ఇవ్వనందుకు అశ్వనీ శర్మపై విమ‌ర్శ‌లు గుప్పించారు. 

మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప‌రోక్షంగా టార్గెట్ చేస్తూ.. ఒక వేదిక లేదా రాష్ట్రాన్ని నడపడం వేరు అని చెప్పే వారు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదని విమ‌ర్శించారు. వాకౌట్ చేసిన ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు గైర్హాజరవడంతో సభ తీర్మానాన్ని ఆమోదించింది.

ఈ తీర్మానం వెనుక ఉన్న ఉద్దేశాన్ని తాను అనుమానిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర విభాగం చీఫ్ అశ్వనీ శర్మ తెలిపారు, అన్ని రాజకీయ పార్టీల సభ్యులు ఈ చర్యకు మద్దతు ఇచ్చారు. కేంద్రం నిబంధనలను నోటిఫై చేసింది, దీని ప్రకారం పదవీ విరమణ వయస్సు 58 నుండి 60 సంవత్సరాలకు మరియు పిల్లల సంరక్షణ సెలవులను ఒక సంవత్సరం నుండి రెండేళ్లకు పెంచారు. ఇప్పటి వరకు, పంజాబ్ సర్వీస్ రూల్స్ చండీగఢ్ ఉద్యోగులకు వర్తిస్తాయి.

చండీగఢ్ ఉత్తర భారతదేశంలోని ఒక నగరం, కేంద్రపాలిత ప్రాంతం. ఇది ఐదు దశాబ్దాల క్రితం పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాలకు రాజధాని, కాని ఆ రెండింటిలో ఏ రాష్ట్రానికి చెందని కేంద్రపాలిత ప్రాంతంగా ఉండడం చండీగఢ్ ప్రత్యేకత. 1966లో పంజాబ్ నుంచి హర్యానా ఏర్పడింది. దీంతో చండీగఢ్ నగరం మధ్యలో ఉన్నందున దీనిని కేంద్రపాలిత ప్రాంతం చేశారు. పంజాబ్, హర్యానా రెండు రాష్ట్రాలకు రాజధానిని చేసారు.