పెరిగిన ప్రధాని మోదీ ఆస్తులు.. నష్టాల్లో అమిత్ షా
వీటితో పాటు స్థిరాస్తులు రూ. 1.75 కోట్లకు పైగా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకూ మోదీ ఎలాంటి రుణాలు తీసుకోలేదని, అంతేకాకుండా ఆయన పేరు మీద వాహనం కూడా లేదని పేర్కొన్నారు. అయితే రూ. 1.5 లక్షలు విలువ చేసే 45 గ్రాముల బరువు గల నాలుగు ఉంగరాలున్నట్టు పీఎంవో తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తుల విలువ గతేడాదితో పోలిస్తే.. ఈ సంవత్సరం పెరిగాయట. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయమే స్వయంగా వెల్లడించింది. 2019 జూన్ తో పోలిస్తే ఈ ఏడాది జూన్ మాసానికి మోదీ నికర ఆస్తుల విలువ రూ.36లక్షల రూపాయిలు పెరిగి రూ.2.85 కోట్లకు చేరుకుంది. గతే ఏడాది ఆయన చేసిన బ్యాంకు డిపాజిట్లు, ఇన్వెస్ట్ మెంట్స్ కారణంగా ఆస్తుల విలువ పెరిగినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది.
ఇక ఈ ఏడాది జూన్ నాటికి మోదీ చేతిలో కేవలం రూ.31,450 మాత్రమే ఉండగా.. గుజరాత్ లోని గాంధీనగర్ ఎస్బీఐ బ్రాంచీలో బ్యాంక్ బ్యాలెన్స్ రూ.3,38,173 మాత్రమే ఉన్నాయి. వీటితో పాటు ఇదే బ్రాంచీలో రూ.1,60,28,939 ఎఫ్డీఆర్, ఎంఓడీ బ్యాలెన్స్ ఉంది. అంతేకాకుండా రూ.8,43,124 విలువ గల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్(ఎన్ఎస్సీ), రూ. 1,50,957 విలువ చేసే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు, రూ. 20 వేలు విలువ చేసే ట్యాక్స్ సేవింగ్ ఇన్ఫ్రా బాండ్స్ కలిగి ఉన్నారు.
వీటితో పాటు స్థిరాస్తులు రూ. 1.75 కోట్లకు పైగా ఉన్నాయి. అయితే ఇప్పటి వరకూ మోదీ ఎలాంటి రుణాలు తీసుకోలేదని, అంతేకాకుండా ఆయన పేరు మీద వాహనం కూడా లేదని పేర్కొన్నారు. అయితే రూ. 1.5 లక్షలు విలువ చేసే 45 గ్రాముల బరువు గల నాలుగు ఉంగరాలున్నట్టు పీఎంవో తెలిపింది.
ప్రధాని మోదీ ఆస్తులు పెరుగుతుండగా.. అమిత్ షా ఆదాయం మాత్రం తగ్గిపోయిందట. షేర్ మార్కెట్ ప్రభావంతో అమిత్ షా నికర ఆస్తుల విలువ తగ్గిపోయింది. గతేడాది జూన్ నెలకు రూ. 32.3 కోట్ల నికర ఆస్తులు కలిగినట్లు అమిత్ షా ప్రకటించగా... ఈ యేడాది మాత్రం వాటి నికర ఆస్తుల విలువ రూ. 28.63 కోట్లకు పడిపోయింది. వీటితో పాటు రూ.13.56 కోట్లు విలువ చేసే స్థిరాస్తులు గుజరాత్ లోనే ఉన్నట్లు పీఎంవో పేర్కొంది.