PM Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూకాశ్మీర్ పర్యటనపై పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఘాటుగా స్పందించింది. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యానించే అధికారం పాకిస్థాన్కు లేదని హెచ్చరించింది.
jammu kashmir news: పాకిస్థాన్ మరోసారి భారత్ పై తన అక్కసును వెల్లగక్కింది. ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూకాశ్మీర్ పర్యటనపై విమర్శలు చేసిన పాకిస్థాన్పై భారత్ మండిపడింది. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యానించే అధికారం పాకిస్థాన్కు లేదని హెచ్చరించింది. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్ కు సంబంధించిన విషయాలపై వ్యాఖ్యానించడానికి ఇస్లామాబాద్కు ఎటువంటి అధికారం లేదని పేర్కొంది. రెగ్యులర్ మీడియా సమావేశంలో పాకిస్థాన్ వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ సమాధానమిస్తూ.. పై వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి జమ్మూకాశ్మీర్ లో పర్యటనలో లభించిన ఆదరణ మరియు కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన మార్పులు ఇప్పటికీ ఉన్న ఏవైనా సందేహాలకు చాలా స్పష్టమైన సమాధానమని అన్నారు.
పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ పర్యటనను "staged"గా అభివర్ణించడంపై కూడా ఆయన మండిపడ్డారు. "staged అనే పదం నాకు అర్థం కాలేదు. ఇది పర్యటన జరగలేదని సూచిస్తున్నట్లు కనిపిస్తోంది. మేము అలా చూపించడానికి ప్రయత్నిస్తున్నాము" అని అతను చెప్పాడని పేర్కొన్నారు. "అతను (ప్రధాని మోడీ) పొందిన ఆదరణ మరియు మీరు చూసిన విజువల్స్.. పీఎం ప్రారంభించిన అభివృద్ధి ప్రాజెక్టులు మరియు జమ్మూకాశ్మీర్ లో జరిగిన మార్పులు ప్రధానమంత్రి పర్యటన గురించి లేవనెత్తే ఏవైనా ప్రశ్నలకు చాలా స్పష్టమైన సమాధానం అని నేను చాలా స్పష్టంగా భావిస్తున్నాను. ఏ సందర్భంలోనైనా, జమ్మూ కాశ్మీర్లో ఏమి జరుగుతుందో దాని దృక్కోణంలో పాకిస్థాన్కు మాట్లాడే అవకాశం లేదని నేను భావిస్తున్నాను" అని పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్లో ప్రధాని పర్యటన ముందస్తు ప్రణాళికతో జరిగిందని పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ అన్నారు. దీనిపై విదేశాంగ మంత్రి విమర్శలు గుప్పించారు. జమ్మూకశ్మీర్లో ప్రధాని నరేంద్ర మోడీకి ఇచ్చిన స్వాగత ఆదరణను అందరూ చూశారు. తాను ప్రారంభించిన అభివృద్ధి ప్రాజెక్టులు, అక్కడ చోటుచేసుకున్న మార్పులే పాకిస్థాన్కు సమాధానాలు చెప్పాయన్నారు. ఏది ఏమైనా జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడే అధికారం పాకిస్థాన్కు లేదు. ఈ అంశంపై పాకిస్థాన్ ప్రస్తావన సరికాదు. జమ్మూకశ్మీర్లో పాకిస్థాన్కు స్థానం లేదని ఆయన అన్నారు. ఈ అంశంపై తాను ఉన్నత స్థాయిలో ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల కోసం ప్రధాని గత ఆదివారం జమ్మూకశ్మీర్కు వచ్చారు. ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన తర్వాత ఆయన జమ్మూకశ్మీర్లో పర్యటించడం ఇదే తొలిసారి.
ప్రధాని మోడీ పర్యటనపై పాకిస్థాన్ అసంతృప్తిని వ్యక్త చేసింది. భారత ప్రధాని మోడీ జమ్మూకాశ్మీర్లో పర్యటించడం, జలవిద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ట్వీట్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భారత్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కశ్మీరీలు యాత్రను తిరస్కరించి బ్లాక్ డే పాటించినందున మేము వారికి అండగా నిలుస్తామని షెహబాజ్ షరీఫ్ అన్నారు.
