Asianet News TeluguAsianet News Telugu

PM Modi Pakistani Sister:  ప్ర‌ధాని మోడీకి రాఖీ పంపిన పాక్ సోద‌రి..  మూడు ద‌శాబ్దాలుగా కొన‌సాగుతున్న‌ అనుబంధం

PM Modi Pakistani Sister: రక్షా బంధన్ శుభ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పాకిస్థానీ సోదరి గా పిలువ‌బ‌డే కమర్ మొహ్సిన్ షేక్ పవిత్రమైన రాఖీని పంపారు, 2024 సార్వత్రిక ఎన్నికల విజ‌యం సాధించాల‌ని కోరుకున్నారు. 
 

PM Modi Pakistani sister sends rakhi and wishes him for 2024 elections
Author
Hyderabad, First Published Aug 7, 2022, 8:32 PM IST

PM Modi Pakistani Sister: సోదర, సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు, ఆత్మీయతలకు ప్రతీక రక్షాబంధన్. ఈ నెల 11న దేశ వ్యాప్తంగా రక్షాబంధన్ ను జరుపుకోనున్నారు. రక్షాబంధన్ పండుగ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ‌వ్యాప్తంగా ఎంతో మంది మ‌హిళ‌లు ప‌విత్ర‌మైన రాఖీలను పంపిస్తారు. రక్షా బంధన్ శుభాభినంద‌న‌లు తెలుపుతుంటారు. ప్రధాని మోడీకి శ‌త్రు దేశ‌మైన పాకిస్తాన్ నుంచి కూడా రాఖీలు పంపేవారు ఉన్నార‌నే న‌మ్ముతారా ?  పాకిస్థాన్ కు చెందిన కమర్ మొహ్సిన్ షేక్ అనే మ‌హిళ కూడా ప్ర‌ధానికి ప్ర‌తి యేటా రాఖీ పంపిస్తుంది. వారి అనుబంధం ఈనాటిది కాదు.. గత మూడు శ‌తాబ్దాలుగా ఆమె ప్ర‌ధాని మోడీకి రాఖీలు పంపిస్తున్న‌ది. అందుకే ఆమెను మోడీ పాకిస్తాన్ సోదరిగా పిలుస్తారు.

ఈ ఏడాది కూడా మోడీ పాకిస్తాన్ సోదరి కమర్ మొహ్సిన్ షేక్ పవిత్రమైన రాఖీని పంపారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్ర‌ధాని మోడీ మంచి ఆరోగ్యంతో పాటు దీర్ఘాయుష్షు పొందాలని ఆ భ‌గ‌వంతుడిని ప్రార్థిస్తున్న‌నని ప్రధాని మోదీకి కమర్ మొహ్సిన్ షేక్ లేఖ రాశారు. 

ఈ సందర్భంగా కమర్ మొహ్సిన్ షేక్ మీడియాతో మాట్లాడుతూ..  ఈసారి ప్ర‌ధాని మోదీ నన్ను ఢిల్లీకి పిలుస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అన్ని సన్నాహాలు కూడా చేశాను. ప్రధాని మోదీకి స్వయంగా   రాఖీ కట్టాలని ఉంది. ఆయ‌న కోసం ఎంబ్రాయిడరీ డిజైన్‌లతో సిల్క్ రిబ్బన్‌తో స్వ‌యంగా రాఖీని తయారు చేశానని తెలిపారు. 
 
అలాగే.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి సందేహం లేదని, మళ్లీ మోడీనే ప్రధాని అవుతానని చెప్పారు. ఆయ‌న ప్రధానిగా కొన‌సాగ‌డానికి అన్నివిధాల అర్హుడు. ప్ర‌ధాని మోడీకి భార‌త్ ను ముందుకు తీసుకెళ్లా  సామర్థ్యం ఉంది. ఈ సారీ కూడా మోడీ భారతదేశానికి ప్రధాని కావాలని  కోరుకుంటున్నానని తెలిపింది.. 
  
గత రక్షాబంధన్ నాడు కూడా ప్రధాని మోదీకి పాకిస్థానీ సోదరి కమర్ మొహ్సిన్ షేక్  రాఖీ, రక్షా బంధన్ కార్డును పంపారు. మొహ్సిన్ షేక్ 27 సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాఖీ కడుతున్నారు.  కమర్ మొహ్సిన్ షేక్. కరాచీకి చెందిన ఖమర్ ను వివాహం చేసుకున్నారు. అక్క‌డే నివ‌సిస్తుంటారు.
 
ఏది ఏమైనప్పటికీ.. రాఖీ పండుగ‌ రాగానే దేశం నలుమూలల నుండి సోదరీమణులు రాఖీతో ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. రాజస్థాన్ నుండి ప్రవాహాలు ప్రతి సంవత్సరం ప్రధానమంత్రి మోడీకి రాఖీతో పాటు స్వీట్లను కూడా పంపుతాయి.

సాధారణంగా..  భారత్, పాకిస్తాన్‌లు ఒకదానికొకటి ప్రత్యర్థులుగా పరిగణించబడుతున్నాయి, అయిన‌ప్ప‌టికీ.. ఈ రెండు దేశాల ప్రజలు స్నేహా సంబంధాలను కొన‌సాగిస్తునే ఉన్నారు. ప్ర‌ధాని నరేంద్ర మోదీకి, పాకిస్థానీ సోదరి కమర్ మొహ్సిన్ షేక్ కు మ‌ధ్య సోదర, సోదరీమణుల అనుబంధం దాదాపు మూడు దశాబ్దాలుగా కొన‌సాగుతోంది. ఇరువురి మ‌ధ్య సోద‌ర భావం, ప్రేమ రెండు దేశాల మధ్య సత్సంబంధాలను నెలకొల్పడంలో చొరవ చూపక‌పోదు. వీరిద్ద‌రి అనుబంధం గురించి భారత్‌లోనే కాకుండా పాకిస్థాన్‌లోనూ ప్రశంసలు వెల్లివిరుస్తాయి.

Follow Us:
Download App:
  • android
  • ios