భారత్పై బయోటెక్కు షాక్: పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్ వద్దు... ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్కు అనుమతినిస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ను ఛాలెంజ్ చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది
పిల్లలపై కొవాగ్జిన్ ట్రయల్స్కు అనుమతినిస్తూ కేంద్రం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ను ఛాలెంజ్ చేస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది.
అయితే 2 నుంచి 18 ఏళ్ల వయసు వారిపై కొవాగ్జిన్ ఫేస్ 2, ఫేస్ 3 ట్రయల్స్కి డీసీజీఐ ఇటీవల అనుమతినిచ్చింది. త్వరలో ఈ ట్రయల్స్ ప్రారంభమవుతాయని భారత్ బయోటెక్ తెలిపింది. అయితే ఈ సమయంలో ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు కావడం ఆసక్తికరంగా మారింది.
Also Read:వ్యాక్సినేషన్ వేగవంతం: కొవాగ్జిన్ ఫార్ములా బదిలీకి కేంద్రం ఓకే..?
రెండు, మూడు దశల క్లినికల్ పరీక్షల్లో ఆరోగ్యవంతులైన 525 మంది వాలంటీర్లు పాల్గొంటారని కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పిల్లలపై ఈ టీకా ఏమేరకు పనిచేస్తుందో తెలుసుకోడానికి క్లినికల్ పరీక్షలు నిర్వహించాలని భారత్ బయోటెక్ ప్రతిపాదించగా, అందుకు డీసీజీఐ, దానికి చెందిన సబ్జెక్టు నిపుణుల కమిటీ అంగీకరించిన విషయం తెలిసిందే