Petrol diesel price:  దేశంలోని మెట్రో న‌గ‌రాల్లో ఇంధ‌న ధ‌ర‌లు రికార్డు గ‌రిష్ఠానికి చేరుకున్నాయి. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు దాదాపు అన్ని న‌గ‌రాల్లో సెంచ‌రీ దాటాయి. సుమారు నాలుగున్న‌ర నెల‌ల త‌ర్వాత వ‌రుస‌గా 14 సార్లు దేశీయంగా చ‌మురు ధ‌ర‌లు పెరిగాయి.  

Petrol, diesel price: దేశంలో చ‌మురు ధ‌ర‌లు గ‌రిష్ఠ స్థాయికి చేరుకున్నారు. దాదాపు దేశంలోని అన్ని ప్రాంతాల్లో పెట్రోల్ లీట‌రుకు రూ.100 పైనే కొన‌సాగుతోంది. పెట్రోలు , డీజిల్ ధరలు వరుసగా 17వ రోజు శనివారం అంటే ఏప్రిల్ 23న మారలేదు. చివరిసారిగా ఏప్రిల్ 6న పెట్రోల్ మరియు డీజిల్ ధరలు 80 పైసలు పెరిగాయి, మొత్తంగా పెరిగిన ధరలను పరిగణనలోకి తీసుకుంటే.. గత 33 రోజుల నుండి లీటరుకు రూ. 10. చొప్పున ఇంధ‌న ధ‌ర‌లు పెరిగాయి. దీంతో దేశ‌రాజ‌ధాని ఢిల్లీ స‌హా అనేక మెట్రో న‌గ‌రాల్లో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు గ‌ణ‌నీయంగా పెరిగాయి. దీంతో ఢిల్లీలో పెట్రోల్ ధర గతంలో రూ. 104.61 నుండి రూ. 105.41 కాగా, డీజిల్ ధరలు లీటరుకు రూ. 95.87 నుండి రూ. 96.67కి పెరిగాయని రాష్ట్ర ఇంధన రిటైలర్ల ధర నోటిఫికేషన్ పేర్కొంది. దేశవ్యాప్తంగా చ‌మురు ధ‌ర‌లు.. కేంద్ర ప్ర‌భుత్వం విధిస్తున్న ప‌న్నుతో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వాలు విధిస్తున్న ప‌న్నులు, అంత‌ర్జాతీయంగా ముడి చ‌మురు ధ‌ర‌ల ఆధారంగా చ‌మురు కంపెనీలు నిత్యం ఇంధ‌న ధ‌ర‌ల‌ను స‌వ‌రిస్తుంటాయి. 

ప్రభుత్వ యాజమాన్యంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (OMCs) ప్రకారం.. ఏప్రిల్ 23 (శ‌నివారం) పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 17వ రోజు మారలేదు. ప్రధాన మెట్రోపాలిటన్ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి... 

ఢిల్లీ 

పెట్రోలు: లీటరుకు రూ. 105.41

డీజిల్: లీటరుకు రూ. 96.67

మంబ‌యి 

పెట్రోలు: లీటరుకు రూ. 120.51

డీజిల్: లీటరుకు రూ. 104.77

చెన్నై 

పెట్రోలు: లీటరుకు రూ. 110.85

డీజిల్: లీటరుకు రూ. 100.94

కోల్‌కతా

పెట్రోలు: లీటరుకు రూ. 115.12

డీజిల్: లీటరుకు రూ. 99.83 

భోపాల్

పెట్రోలు - లీటరుకు రూ.118.14

డీజిల్ - లీటరుకు రూ.101.16

హైదరాబాద్

పెట్రోలు - లీటరుకు రూ.119.49

డీజిల్ - లీటరుకు రూ.105.49

బెంగళూరు

పెట్రోలు - లీటరుకు రూ.111.09

డీజిల్ - లీటరుకు రూ.94.79

గౌహతి

పెట్రోలు - లీటరుకు రూ.105.66

డీజిల్ - లీటరుకు రూ.91.40

లక్నో

పెట్రోలు - లీటరు రూ.105.25

డీజిల్ - లీటరుకు రూ.96.83

 గాంధీనగర్

పెట్రోలు - లీటరుకు రూ.105.29

డీజిల్ - లీటరుకు రూ.99.64


తిరువనంతపురం

పెట్రోలు - లీటరుకు రూ.117.19

డీజిల్ - లీటరుకు రూ.103.95

మార్చి 22న రేట్ల సవరణలో నాలుగున్నర నెలల సుదీర్ఘ విరామం ముగిసిన తర్వాత ఏప్రిల్ 6న ఇంధన ధరలు పెరగడం 14వ సారి. ఈ స‌మ‌యంలో మొత్తం మీద పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.10 చొప్పున పెరిగాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవంబర్ 4 నుండి ధరలు స్థిరంగా ఉంచారు. ఈ కాలంలో ముడిసరుకు (ముడి చమురు) ధర బ్యారెల్‌కు సుమారు $30 పెరిగింది. మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీసెస్.. ఎన్నికల సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలను నిలుపుదల చేయడం వల్ల రాష్ట్ర రిటైలర్లు కలిసి దాదాపు $2.25 బిలియన్ల (రూ. 19,000 కోట్లు) ఆదాయాన్ని కోల్పోయారని పేర్కొంది. చమురు కంపెనీలు డీజిల్ ధరలను లీటరుకు రూ. 13.1-24.9, గ్యాసోలిన్ (పెట్రోల్)పై రూ. 10.6-22.3 వరకు పెంచవలసి ఉంటుంది అని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ తెలిపింది. బ్యారెల్ క్రూడ్ ఆయిల్‌కు సగటున 100 డాలర్లు, సగటు క్రూడాయిల్ ధర 110-120 డాలర్లకు పెరిగితే లీటరుకు రూ. 15-20 పెంపుదల కోసం రిటైల్ ధరలో లీటరుకు రూ.9-12 పెరుగుదల అవసరమని క్రిసిల్ రీసెర్చ్ తెలిపింది. భారతదేశం తన చమురు అవసరాలను తీర్చడానికి దిగుమతులపై 85 శాతం ఆధారపడుతోంది.