ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా వ్యక్తిగత నివాసంపై ఆదివారం ఆందోళనకారులు పెట్రోల్ బాంబులు విసిరారు. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక, ముఖ్యమంత్ర కాన్రాడ్ సంగ్మా... ప్రస్తుతం తన అధికారిక నివాసంలో ఉంటున్నారు. 

షిల్లాంగ్ : ఈశాన్య రాష్ట్రం మేఘాలయలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నేషనల్ లిబరేషన్ కౌన్సిల్ (హెచ్ఎన్ఎల్ సీ) మాజీ నేత చెరిష్ స్టార్ఫీల్డ్ థాంగ్ కీని పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంతో.. హింసాత్మక ఘటనలు తలెత్తాయి. థాంగ్ కీ మద్దతుదారులు.. కొన్ని చోట్ల ప్రభుత్వ వాహనాలపై దాడులు చేశారు. 

ఓ చోట పోలీస్ వాహనానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. అంతటితో ఆగక ఏకంగా ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా వ్యక్తిగత నివాసంపై ఆదివారం ఆందోళనకారులు పెట్రోల్ బాంబులు విసిరారు. అయితే ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇక, ముఖ్యమంత్ర కాన్రాడ్ సంగ్మా... ప్రస్తుతం తన అధికారిక నివాసంలో ఉంటున్నారు. 

ఆందోళనకారులు 3వ మైలు ఎగువ షిల్లాంగ్ లోని లైమర్ లోని ముఖ్యమంత్రి వ్యక్తి గత నివాసం వద్ద ఈ దాడిక పాల్పడ్డారు. రెండు మోలోటోవ్ కాక్ టైల్ బాటిళ్లను సీఎం నివాసంపై విసిరారు. వీటిలో మొదటి బాటిల్ ఇంటి ముందు భాగంలో పడగా, రెండవది పెరడు వెనుకకు విసిరివేశారు. ఇది గమనించిన గార్డుల వెంటనే అక్కడకు చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. 

రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలకు బాధ్యత వహిస్తూ.. మేఘాలయ హోంమత్రి లక్మెన్ రైంబుయ్ తన పదవికి రాజీనామా చేశారు. తనను హోం శాఖ నుంచి రిలీవ్ చేయాలని కోరుతూ సీఎం కాన్రాడ్ సంగ్మాకు లేఖ రాశారు. ఇది కేసు విచారణ పారదర్శక సాగడానికి ప్రభుత్వ తీసుకున్న న్యాయపరమైన చర్యగా నిలుస్తుందని అన్నారు. 

2018లో లొంగిపోయిన చెస్టర్ ఫీల్డ్ థాంగ్ కీకి.. ఈ నెల లైతుంఖ్రా వద్ద చోటు చేసుకున్న పేలుడులో ఆయన పాత్రపై ఆధారాలు లభించడంతో ఆగస్టు 13 పోలీసులు అతని ఇంట్లో దాడులు నిర్వహించారు. అక్కడ మరిన్ని ఆధారాలు లభిస్తాయని పోలసులు భావించారు. అయితే థాంగ్ కీ పోలీసులపై కత్తితో దాడి చేయాలని చూశాడని.. ఈ క్రమంలో అతడిని ఎదుర్కొవడానికి జరిపిన కాల్పుల్లో థాంగ్ కీ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. 

కాంగ్రెస్ కు బిగ్ షాక్ : పార్టీ వీడిన మాజీ ఎంపీ సుస్మితా దేవ్...

ఇక, ఘటనమీద థాంగ్ కీ కుటుంబ సభ్యులతో పాటు, మద్దతుదారులు పెద్ద ఎత్తుున నిరసన వ్యక్తం చేస్తున్నారు. థాంగ్ కీ అంత్యక్రియల్లో వందలాది మంది ఆయన మద్దతుదారులు నల్ల జెండాలతో నిరసన తెలియజేశారు. కొన్ని చోట్ల ఆందోళనకారులు పోలసుల పైకి రాళ్లు విసిరారు. ఈ హింసాత్మక ఘటన నేపథ్యంలో అధికారులు కర్ఫ్యూ విధించారు. 

మేఘాలయ హోంమంత్రి లక్మెన్ రైంబుమ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో కర్ఫ్యూ విధించారు. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి మంగళవారం రాత్రి 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుందని తెలిపారు. అలాగే నాలుగు జిల్లాల్లో మొబైల్ ఇంటర్ నెట్ సేవలను ఆదివారం సాయంత్రం 6 గంటలనుంచి, 48 గంటల పాటు నిలిపివేస్తున్నట్టుగా చెప్పారు. 

ఇక మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా, థాంగ్ కీ మరణం మద విచారణకు ఆదేశించినున్నట్లు చెప్పారు. మరోవైపు ఈ ఘటనను మేఘాలయ మానవ హక్కుల స్పందించింది. సుమోటో కేసుగా విచారణకు స్వీకరించింది. దీనిమీద 15 రోజుల్లోగా సమగర నివేదిక అందించాల్సిందిగా చీఫ్ సెక్రటరీని కోరింది.