రైలు ఎక్కే సమయంలోనూ, దిగే సమయంలోనూ ఏమరుపాటుగా ఉంటే  ప్రమాదాలు జరుగుతాయి.  ఇదే తరహా ప్రమాదం ఒకటి  ముంబైలో చోటు చేసుకుంది.

న్యూఢిల్లీ: రైలుకింద పడిన ప్రయాణీకుడిని కాపాడేందుకు తోటి ప్రయాణీకులు రైలును తోశారు. ముంబైలోని వాషి రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెడిట్ సోషల్ మీడియా వినియోగదారుడు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇదే రైలులో తాను ప్రయాణీస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. 

also read:ఆపరేషన్ థియేటర్‌లో ఫ్రీ వెడ్డింగ్ షూట్: డాక్టర్ సస్పెన్షన్

ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా వ్యాఖ్యలు చేస్తున్నారు.ఈ దృశ్యం చూడడానికి చాలా సంతోషాన్ని ఇస్తుందన్నారు. ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం అందరూ ఐక్యంగా నిలిచారన్నారు. మానవత్వం ఇంకా ఉందని చెప్పడానికి ఈ దృశ్యం నిదర్శనమని మరొకరు వ్యాఖ్యానించారు. కదులుతున్న రైలు నుండి దూకిన ప్రయాణీకుడిదే బాధ్యత అని మరొక నెటిజన్ వ్యాఖ్యానించారు.

also read:దక్షిణాదిపై బీజేపీ ఫోకస్: పీ.వీ.కి భారత రత్న, కాంగ్రెస్‌పై పైచేయి

రైలు ఎక్కే సమయంలో, దిగే సమయంలో ఏమరుపాటుగా ఉంటే ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ముంబైలోని పలు రైల్వేస్టేషన్లలో రైలు ఎక్కే సమయంలో దిగే సమయంలో ఈ తరహా ప్రమాదాలు జరిగిన ఘటనలు అనేకం ఉన్నాయి.

View post on Instagram