ఎయిర్ ఇండియా విమానం గాల్లో ఉండగా ఓ ప్రయాణికుడు సీట్లోనే మల, మూత్ర విసర్జన చేశాడు. సదరు వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ : ముంబై-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో గగనతలంలో నేలపై మల, మూత్ర విసర్జన చేశాడనే ఆరోపణలతో ఢిల్లీలో ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. జూన్ 24న ఏఐసీ 866 విమానంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
ఎఫ్ఐఆర్ ప్రకారం, సీటు నంబర్ 17ఎఫ్లో ప్రయాణిస్తున్న రామ్ సింగ్, విమానంలోని 9వ వరుసలో మల, మూత్ర విసర్జన చేయడంతో పాటు ఉమ్మివేశాడు. ఇది గమనించిన కొందరు విమాన సిబ్బందికి చెప్పడంతో.. క్యాబిన్ సిబ్బంది ప్రయాణీకుడికి మౌఖిక హెచ్చరిక ఇచ్చారు. ఆ తరువాత అతడిని మిగతా ప్రయాణికులకు విడిగా ఉంచారు.
డ్యూటీ టైం అయిపోయింది, విమానం తీయను.. మొండికేసిన ఎయిరిండియా పైలెట్.. చివరికి... వీడియో వైరల్..
పరిస్థితిని పైలట్-ఇన్-కమాండ్కు కూడా తెలియజేశారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణీకులను ఎస్కార్ట్ చేయడానికి భద్రత కావాలని కోరుతూ కంపెనీకి సందేశం పంపబడింది. ఈ చర్య చాలా మంది ప్రయాణికులను ఆందోళనకు గురిచేసిందని ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
విమానం ఢిల్లీకి చేరుకునే సమయానికి.. ఎయిర్ ఇండియా సెక్యూరిటీ హెడ్ హాజరై, ఆ ప్రయాణికుడిని స్థానిక పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 294 (అశ్లీల చర్యలు), 510 (మద్యం సేవించిన వ్యక్తి బహిరంగంగా దుర్వినియోగం చేయడం) కింద కేసు నమోదు చేసినట్లు పేర్కొంది.
నవంబర్ 26, 2022న, మత్తులో ఉన్న ఒక వ్యక్తి, న్యూయార్క్ నుండి ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణిస్తున్న మహిళా సహ ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడు. పది రోజుల తర్వాత, డిసెంబరు 6న పారిస్-న్యూఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో ఒక మహిళా ప్రయాణికురాలి దుప్పటిపై మద్యం మత్తులో ఓ వ్యక్తి "మూత్ర విసర్జన" చేశాడు.
