కాశ్మీర్ లోని యువతను పాకిస్తాన్ ఉగ్రవాదులు వారి వైపు ఆకర్శిస్తున్నారని లెఫ్టినెంట్ జనరల్ పాండే అన్నారు. సరిహద్దు నుంచి చొరబాటుకు అవకాశం లేనందున ఉగ్రవాదులు స్థానిక యువతను వినియోగించుకుంటున్నారని తెలిపారు.
పాకిస్తాన్లో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులు కాశ్మీర్లో స్థానిక యువతను ఉగ్రవాదలుగా మారుస్తున్నారని చినార్ కార్ప్స్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీవోసీ) లెఫ్టినెంట్ జనరల్ డీపీ పాండే అన్నారు. పాక్ ఉగ్రవాదులు సరిహద్దులు దాటి రావడం లేదని, స్థానిక యువతనే వారు ఉపయోగించుకుంటున్నారని అన్నాన్నారు. దేశంలోకి చొరబడకుండా సైన్యం ఏర్పాటు చేసిన గ్రిడ్ ను ఉగ్రవాదులు ఉల్లంఘించలేకపోయారని ఆయన అన్నారు.
కశ్మీర్ లో పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాదుల ఏరివేతపై లెఫ్టినెంట్ జనరల్ పాండే మీడియాతో సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ ఈ ఉగ్రవాదులలో ఎక్కువ మంది ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉండిపోయారు. స్థానిక యువతనే ఇక్కడ ఉగ్రవాద ఫేస్ గా ఉంచుతున్నారు ’’ అని అన్నారు. ‘‘ స్థానిక ఉగ్రవాదుల సంఖ్య తగ్గడంతో వారు ఇప్పుడు బహిర్గతం అవుతున్నారు. పరిచయాలు జరుగుతున్నాయి’’ అని ఆయన అన్నారు.
భారత సరిహద్దు భద్రతపై లెఫ్టినెంట్ జనరల్ పాండే మాట్లాడుతూ ‘‘ ఈ సంవత్సరం సరిహద్దు ద్వారా ఒక చొరబాటు ప్రయత్నం మాత్రమే జరిగింది. అది కూడా విఫలమైంది. ఉగ్రవాదులు మా చొరబాటు వ్యతిరేక గ్రిడ్ లను దాటి రాలేకపోయారు.’’ అని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఆదివారం కుల్గామ్ పోలీసులు, ఆర్మీ (34 RR) నిషేధిత తీవ్రవాద సంస్థ LeTకి చెందిన ఒక హైబ్రిడ్ టెర్రరిస్ట్ను అరెస్టు చేశారు. అతడిని అవి గడిహామా కుల్గామ్కు చెందిన యామిన్ యూసఫ్ భట్ గా గుర్తించారు. అతడి వద్ద నుంచి ఒక పిస్టల్, రెండు గ్రెనేడ్లు, 51 పిస్టల్ రౌండ్లతో సహా నేరారోపణ చేసే పదార్థాలు, ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అలాగే నగరంలోని నౌగామ్ ప్రాంతంలో మరో హైబ్రిడ్ ఉగ్రవాదిని కూడా అరెస్టు చేశారు. ‘‘ ఒక నిర్దిష్ట సమాచారం మేరకు శ్రీనగర్ పోలీసులు, (50 RR) శ్రీనగర్లోని నౌగామ్ నుండి ముచ్వా, బద్గామ్కు చెందిన షేక్ సాహిద్ గుల్జార్ అనే హైబ్రిడ్ ఉగ్రవాదిని అరెస్టు చేశారు’’ అని శ్రీనగర్ పోలీసులు ఒక ట్వీట్లో తెలిపారు. ఒక 'హైబ్రిడ్ టెర్రరిస్ట్' తన హ్యాండ్లర్లు ఇచ్చిన పనిని నిర్వహిస్తాడని పోలీసులు తెలిపారు. ఆ పని పూర్తయిన తరువాత తన సాధారణ పనికి తిరిగి వెళ్తాడని చెప్పారు. అతడికి తదుపరి పని అప్పజెప్పేంత వరకు వేచి ఉంటాడని తెలిపారు.
