భారత్‌తో యుద్ధంలో గెలిస్తే నటి మాధురి దీక్షిత్‌ను చేసుకుంటానని పాకిస్థాన్‌కు చెందిన మతగురువు చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది.

ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. సంఘటన తర్వాత, సింధు నదీ ఒప్పందాన్ని నిలిపివేయడంతో సహా పాకిస్థాన్‌పై భారతదేశం అనేక కఠిన చర్యలు తీసుకుంది. దిగుమతులు నిలిపివేయబడ్డాయి. సరిహద్దు మూసివేయబడింది. పాకిస్థాన్ పౌరులకు జారీ చేసిన వీసాలు రద్దు చేయబడ్డాయి. పాకిస్దాన్ కూడా భారత్ పై ఆంక్షలు విధించింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇలా ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. భారత సైన్యం ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం వచ్చే ప్రమాదం ఏర్పడిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు చెందిన ఓ మతగురువు చేసిన వివాదాస్పద వ్యాఖ్య సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఆయన మాట్లాడిన వీడియో ఎక్స్‌లో వైరల్‌గా వ్యాపిస్తోంది. 

ఆ వీడియోలో ఒక మతగురువు తన కొడుకు పక్కన కూర్చుని మాట్లాడుతున్నాడు. భారత్‌తో యుద్ధంలో పాకిస్థాన్ గెలిస్తే మాధురి దీక్షిత్‌ను చేసుకుంటానని అన్నారు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాయి. నెటిజన్లు ఆ మతగురువును తీవ్రంగా ఖండిస్తున్నారు.

Scroll to load tweet…

భారత్ - పాకిస్థాన్ యుద్ధం

భారత్-పాకిస్థాన్ మధ్య చివరి యుద్ధం 1999లో జరిగింది. ఈ కార్గిల్ యుద్ధం రెండు నెలలకు పైగా కొనసాగింది. 1999 జూలైలో ఈ యుద్ధం ముగిసింది. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఇటీవల జరిగిన పహల్గాం దాడితో ఇరు దేశాల మధ్య ఘర్షణ మళ్లీ తారాస్థాయికి చేరింది.