ISI funding Bitcoin: షాకింగ్ .. బిట్ కాయిన్ ద్వారా.. పాక్ ఉగ్రసంస్థ ISI కు నిధులు
ISI funding terror via Bit coin: జమ్మూ కాశ్మీర్లోని అనేక చోట్ల బిట్కాయిన్ ద్వారా ఉగ్రవాదులకు ఫండింగ్ జరుగుతోన్నట్టు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాడుల్లో తెలింది. కాశ్మీర్లోని స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (SIA) కేంద్ర పాలిత ప్రాంతంలో ఉగ్రవాదుల సంబంధాన్ని, వారి స్థానిక మద్దతును వెలికితీసింది.
ISI funding terror via Bit coin: భారత్ - పాక్ సరిహద్దుల్లో ఉగ్రవాదం చెలారేగుతోంది. రోజురోజుకు ఉగ్రవాదులు అమాయకులపై దాడులు చేస్తూ.. రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (SIA) జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో దాడులు చేసింది. నివేదిక ప్రకారం.. ఏజెన్సీ పోలీసులు, CRPF సిబ్బందితో కలిసి మెంధార్, పూంచ్, బారాముల్లా, కుప్వారా, హంద్వారాలో దాడులు నిర్వహించారు. ఇదే సమయంలో ఏజెన్సీ అరెస్టులు కూడా చేసిందా? లేదా? అనే దానిపై సమాచారం లేదు.
పాకిస్థాన్ కేంద్రంగా నడుస్తున్న ఉగ్ర సంస్థ ISI కు బిట్కాయిన్ల ద్వారా నిధులు సమకూరుస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సమాచారం ప్రకారం.. దీనికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కూడా చురుకుగా మద్దతు ఇస్తుంది. SIA ప్రకారం.. జమ్మూ కాశ్మీర్లో హింస, ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహించడానికి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జమ్మూ, కాశ్మీర్లోని ఏజెంట్లకు బిట్కాయిన్ ద్వారా నిధులు పంపుతోందనే ఏజెన్సీ దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.
ఏజెన్సీ ప్రాథమిక దశలో దర్యాప్తులో పాకిస్తాన్ సూత్రధారి గుర్తించబడింది, అయితే అతని సమాచారం ప్రస్తుతానికి గోప్యంగా ఉంచబడింది. కేంద్రపాలిత ప్రాంతంలో తీవ్రవాద కార్యకలాపాలను నియంత్రించేందుకు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం గతేడాది ఎన్ఐఏ తరహాలో స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ లేదా ఎస్ఐఏను ఏర్పాటు చేసింది. జమ్మూ కాశ్మీర్ పోలీస్ CID చీఫ్ ఈ ఏజెన్సీకి డైరెక్టర్గా నియమించబడ్డారు. స్వయంచాలకంగా ఎఫ్ఐఆర్లను నమోదు చేసే.. అరెస్టులు చేసే అధికారం ఏజెన్సీకి ఉంది. గత కొన్నేళ్లుగా.. ఉగ్రవాదం, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం వంటి అనేక కేసులు నమోదయ్యాయి. వాటి దర్యాప్తు NIAకి అప్పగించబడింది.
SIA అధికారిక ప్రతినిధి ప్రకారం.. ప్రాథమిక దర్యాప్తులో పాకిస్తాన్లో ఒక సూత్రధారి ఉన్నట్టు గుర్తించారు. అతడు పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీల క్రియాశీల మద్దతుతో, పాకిస్తాన్లోని నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సానుభూతితో డబ్బును పంపుతున్నాడు. తీవ్రవాద సంస్థల మధ్య డబ్బు పంపిణీ కోసం J&Kలోని వారి ఏజెంట్లు, UTలో సామూహిక హింస, తీవ్రవాద కార్యకలాపాలకు ఆజ్యం పోసినందుకు వేర్పాటువాదులు ప్రయత్నిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈ రోజు నిర్వహించిన సోదాల్లో, డిజిటల్ పరికరాలు, సిమ్ కార్డ్లు, మొబైల్ ఫోన్లు, డాక్యుమెంట్లలో దాగి ఉన్నట్లు భావిస్తున్న నేరారోపణలు, దర్యాప్తుపై ప్రభావం చూపుతున్నట్లు భావించి, స్వాధీనం చేసుకున్నారు.