monsoon: మరో 2-3 రోజుల్లో కేరళలో రుతుపవనాలు !
Southwest monsoon: వచ్చే 2-3 రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశముందని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలు మరియు లక్షద్వీప్లోని కొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించాయని తెలిపింది.
India Meteorological Department: నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. వచ్చే 2-3 రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రారంభమయ్యే అవకాశముందని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది. నైరుతి రుతుపవనాలు దక్షిణ అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలు మరియు లక్షద్వీప్లోని కొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించాయని తెలిపింది. అంతకుముందు కేరళలో నాలుగు రోజులు ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు ప్రారంభమవుతాయని అంచనా వేసిన ఐఎండీ.. దక్షిణ ద్వీపకల్పంలో ఉన్న అవశేష వాతావరణ వ్యవస్థల ప్రభావం, కేరళపై ముందస్తుగా ప్రారంభమయ్యే సూచనలను దెబ్బతీసి ఉత్తరాది వైపు వేగంగా పురోగమిస్తుందని IMD తెలిపింది.
"తాజా వాతావరణ పరిస్థితులను గమనిస్తే.. దక్షిణ అరేబియా సముద్రం మీదుగా దిగువ స్థాయిలలో పశ్చిమ గాలులు బలపడ్డాయి.. లోతుగా వీస్తున్నాయని తెలిపింది. ఉపగ్రహ చిత్రాల ప్రకారం, కేరళ తీరం మరియు ఆగ్నేయ అరేబియా సముద్రాన్ని ఆనుకుని మేఘావృతమై ఉంది. అందువల్ల, రాబోయే 2-3 రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి అని IMD తెలిపింది. కేరళ మరియు లక్షద్వీప్లోని 14 వాతావరణ కేంద్రాలలో 60 శాతం వరుసగా రెండు రోజులు 2.5 మిమీ లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదైతే, కేరళపై రుతుపవనాలు ప్రారంభమైనట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. మే 16న అండమాన్ నికోబార్ దీవుల్లో రుతుపవనాలు ప్రారంభమైనట్లు IMD ప్రకటించింది. రుతుపవనాలు మే 30 మరియు జూన్ 2 మధ్య ఎప్పుడైనా ప్రవేశించవచ్చునని ప్రస్తుత వాతావరణ పరిస్థితులు సూచిస్తున్నాయని ఐంఎడీ తెలిపింది.
ప్రస్తుతం కేరళ, లక్షద్వీప్లలో ఉరుములు/మెరుపులతో విస్తారంగా తేలికపాటి/మోస్తరు వర్షపాతం కురిసే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు,పుదుచ్చేరి మరియు కారైకల్ ప్రాంతాల్లో అరేబియా సముద్రం నుండి వీస్తున్న పశ్చిమ గాలుల ప్రభావంతో రానున్న ఐదు రోజుల్లో అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని తెలిపింది. జమ్మూ కాశ్మీర్ మరియు హిమాచల్ ప్రదేశ్లలో రాబోయే నాలుగు రోజులలో అక్కడక్కడ ఉరుములతో కూడిన తేలికపాటి/మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేయబడింది. అదేవిధంగా, ఉత్తరాఖండ్, ఉత్తర పంజాబ్, ఉత్తర హర్యానా, ఉత్తరప్రదేశ్ మరియు తూర్పు రాజస్థాన్లలో రాబోయే రెండు మూడు రోజులలో చిరు జల్లులు కురుస్తాయని ఐంఎడీ అంచనా వేసింది.
“వర్షాపాతం కారణంగా భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా ఉన్నాయి.. రాబోయే 5 రోజుల్లో ఎలాంటి వేడి వాతావరణం ఉండదు. పశ్చిమ హిమాలయ ప్రాంతంలో పశ్చిమ భంగం చురుకుగా ఉంది మరియు అక్కడ వర్షాలు కురుస్తాయి. రాబోయే 2 రోజుల పాటు ఢిల్లీలో మేఘావృతమైన వాతావరణం ఉంటుంది” అని IMD సీనియర్ శాస్త్రవేత్త ఆర్కె జెనామణి తెలిపారు.