Asianet News TeluguAsianet News Telugu

స్కూలు గేటుమీద విద్యుత్ తీగ.. విద్యార్థి మృతి, 8మందికి గాయాలు..

బీహార్ లోని దర్భంగా జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యుత్ షాక్ కు గురై ఒక విద్యార్థి మృతి చెందగా, మరో ఎనిమిదిమంది విద్యార్థులు గాయాల పాలయ్యారు. ఈ ఘటన మీద ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. 

one student die, 8 injured due to electricity in bihar - bsb
Author
Hyderabad, First Published Mar 20, 2021, 3:22 PM IST

బీహార్ లోని దర్భంగా జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో విద్యుత్ షాక్ కు గురై ఒక విద్యార్థి మృతి చెందగా, మరో ఎనిమిదిమంది విద్యార్థులు గాయాల పాలయ్యారు. ఈ ఘటన మీద ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. 

మృతుని కుటుంబానికి రూ. 4 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించి, వెంటనే బాధిత కుటుంబానికి ఆ మొత్తాన్ని చెక్కు రూంలో అందించారు. ఈ ప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు తగిన విధంగా వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం స్కూలు గేటుపై ఒక విద్యుత్ తీగ తెగిపడింది. అది గమనించని విద్యార్థి ఆ గేటును తాకాడు. దీంతో విద్యుదాఘాతానికి గురై, అక్కడిక్కడే మృతి చెందాడు. కాగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios