Asianet News TeluguAsianet News Telugu

చప్పుడు చేయవద్దని వారించినందుకు డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌ను రాయితో కొట్టి చంపిన దుండగులు

చప్పుళ్లు చేయవద్దని వారించినందుకు కొందరు దుండుగులు ఏకంగా డ్యూటీలో ఉన్న పోలీసు కానిస్టేబుల్ పై దాడి చేశారు. రాయితో కొట్టారు. రక్తస్రావంతో ఆ కానిస్టేబుల్ మరణించారు.
 

onduty cop assaulted, stoned to death in madhya pradesh
Author
First Published Dec 24, 2022, 2:25 PM IST

భోపాల్: మధ్యప్రదేశ్‌లో కొందరు దుండగులు డ్యూటీలో ఉన్న పోలీసు కానిస్టేబుల్‌ను కొట్టి చంపారు. తీవ్ర రక్తస్రావం అవుతుండగా అతడిని అక్కడే వదిలేసి ఆ దుండగులు స్పాట్ నుంచి పారిపోయారు. చప్పుళ్లు చేయవద్దని వారిని వారించినందుకు కానిస్టేబుల్ పై దాడి చేశారు. ఈ ఘటన దామోహ్ జిల్లా కసాయ్ మండి ఏరియాలో చోటుచేసుకుంది.

కసాయ్ మండి ఏరియా దగ్గర ఒక పోలీసు పోస్టు ఉన్నది. ఎస్ఏఎఫ్ సిబ్బంది అక్కడే ఉన్నారు. శుక్రవారం రాత్రి జవాన్లు ఆ ఔట్‌పోస్టు దగ్గర భోజనం చేస్తూ ఉండగా పెద్ద శబ్దాలు వచ్చాయి. డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ సురేంద్ర సింగ్ బయటకు వచ్చారు. చప్పుళ్లు వస్తున్న వైపు వెళ్లారు. అక్కడ చప్పుళ్లు చేస్తున్నవారిని వారించాడు. చప్పుడు చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆ దుండగులకు, పోలీసు కానిస్టేబుల్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం, ఆ దుండగులు సురేంద్ర సింగ్ తలపై రాయితో  కొట్టారు. ఆ తర్వాత వెంటనే దుండగులు స్పాట్‌ను వదలిపెట్టి పారిపోయారు.

Also Read: ఏపీలో పోలీస్ ఉద్యోగార్ధులకు శుభవార్త: రెండేళ్ల వయస్సు సడలింపునకు వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్

గాయపడ్డ సింగ్‌ను సమీప హాస్పిటల్‌కు తరలించారు. కానీ, కానిస్టేబుల్ అప్పటికే మరణించాడని వైద్యులు డిక్లేర్ చేశారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్పీ డీఆర్ తేనివార్ తెలిపారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని అన్నారు. కాగా, ఈ ఏరియాలో పోలీసు బలగాలు మోహరించాయి. నిందితులను పట్టుకోవాలని పోలీసు బృందాలకు సమాచారం ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios