విషాదం: రైలుపై నిలబడి సెల్పీ దిగుతుండగా యువకుడి సజీవ దహనం
సెల్ఫీ సరదా 14 ఏళ్ల యువకుడి ప్రాణాలు తీసింది. ఒడిశా రాష్ట్రంలోని పర్లాకిమిడి రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకొంది.
భువనేశ్వర్: సెల్ఫీ సరదా 14 ఏళ్ల యువకుడి ప్రాణాలు తీసింది. ఒడిశా రాష్ట్రంలోని పర్లాకిమిడి రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకొంది.
ఒడిశా రాష్ట్రంలోని గజపతి జిల్లాలోని పర్లాకిమిడి రైల్వే స్టేషన్ లో రైలు పై భాగంలో నిలబడి సెల్ఫీ దిగుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.
14 ఏళ్ల యువకుడు రైలు బోగీపై నిలబడి సెల్ఫీ దిగుతున్న సమయంలో హైటెన్షన్ వైర్ తగిలి రెండు రైల్వే బోగీలు దగ్ధమయ్యాయి. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు.
ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే అతడిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించారు. ఆ బాలుడు మరణించినట్టుగా వైద్యులు ప్రకటించారు.
ఈ సమయంలో రెండు బోగీలు దగ్ధమైన ఘటనలో రైల్వే ట్రాక్ వద్ద ఉన్న మృతుడి ఇద్దరు మిత్రులు కూడ స్వల్పంగా గాయపడ్డారు.
ఈ విషయమై దర్యాప్తు చేసేందుకు డివిజన్ రైల్వే మేనేజర్ ఒక కమిటీని ఏర్పాటు చేశారు. కరోనా స్పెషల్ ట్రైన్ గత కొన్ని రోజులుగా గజపతి జిల్లాలోని పర్లాకిమిడి రైల్వే స్టేషన్లో నిలిచింది.