North East Express: బీహార్ లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. న్యూఢిల్లీ నుంచి గౌహతి వెళ్తున్న ఆనంద్ విహార్ కామాఖ్య నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. రైలులోని ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. వీటిలో మూడు బోగీలు బోల్తా పడ్డాయి.

North East Express: బీహార్ లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. న్యూఢిల్లీలోని ఆనంద్ విహార్ నుంచి అస్పాంలోని కామాఖ్యకు వెళ్తున్న నార్త్ ఎక్స్‌ప్రెస్ బుధవారం రాత్రి డిడియు జంక్షన్-పాట్నా రైల్వే మార్గంలో బక్సర్‌లోని రఘునాథ్‌పూర్ స్టేషన్ సమీపంలో ప్రమాదానికి గురైంది. రైలులోని ఒక బోగీ బోల్తా పడగా, ఆరు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందిగా.. 60 నుంచి 70 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. జిల్లా మేజిస్ట్రేట్ అన్షుల్ అగర్వాల్ కూడా ఈ మరణాలను ధృవీకరించారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, రెస్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. 

ఈ ఘోర ప్రమాదం తర్వాత.. డౌన్‌లైన్‌లో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం లు ప్రభావితమయ్యాయి. ఈ మార్గంలో నడిచే చాలా రైళ్లు నిలిచిపోగా, చాలా రైళ్లు తమ రూట్‌లను మార్చడం ద్వారా నడపబడుతున్నారు అధికారులు. బుధవారం జరిగిన ప్రమాదంలో డౌన్‌లైన్‌ రైల్వే ట్రాక్‌ పూర్తిగా దెబ్బతింది. సాంకేతిక బృందం వస్తోంది. డౌన్ లైన్ యొక్క తక్షణ పరిస్థితి ఈ రాత్రి ఏ రైలును దాని గుండా వెళ్ళడానికి అనుమతించాలని అక్కడికక్కడే ఉన్న రైల్వే కార్మికులు చెప్పారు.

నిలిచిపోయిన రైళ్లు

ఈ ప్రమాదం కారణంగా అప్ పూణే దానాపూర్ ఎక్స్‌ప్రెస్, బాబా వైద్యనాథ్ ఎక్స్‌ప్రెస్, అప్ చండీగఢ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, పాట్లీపుత్ర ఎక్స్‌ప్రెస్, డౌన్ విక్రమశిల ఎక్స్‌ప్రెస్, డౌన్ పాట్లీపుత్ర ఎక్స్‌ప్రెస్, భగత్ కీ కోఠి కామాఖ్య ఎక్స్‌ప్రెస్, బికనీర్ గౌహతి ఎక్స్‌ప్రెస్, దిబ్రూగఢ్ రాజధాని ఎక్స్‌ప్రెస్ అప్, డౌన్ తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు సహా పలు అప్ అండ్ డౌన్ రైళ్లు వివిధ చోట్ల నిలిచిపోయాయి. ఇతర మార్గాల ద్వారా రైళ్లను నడిపేందుకు రైల్వే యంత్రాంగం సన్నాహాలు ప్రారంభించింది.

హెల్ప్‌లైన్ నంబర్

రైలు ప్రమాదం నేపథ్యంలో రైల్వేశాఖ హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసింది.

పట్నా - 9771449971
ధన్ పూర్ - 8905697493
ఆరా - 8306182542
కమాండ్ కంట్రో - 7759070004

బీహార్ డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి 

ఈ ఘటనపై బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన భోజ్‌పూర్‌ డీఎం రాజ్‌కుమార్‌కు ఫోన్‌ చేసి ఆసుపత్రిలో ఏర్పాట్లపై సమాచారం తెలుసుకున్నారు. దీనితో పాటు, తేజస్వి గాయపడిన వారికి సరైన చికిత్స కోసం అవసరమైన మార్గదర్శకాలను జారీ చేశారు.