Nitish Kumar| దేశవ్యాప్తంగా మతపరమైన ప్రాంతాల్లో లౌడ్స్పీకర్ల వినియోగానికి సంబంధించి రేగిన వివాదంపై బీహార్ సీఎం నితీశ్కుమార్ స్పందించారు. ఈ వివాదం పనికిరాని చర్య అని.. బీజేపీ నేతలకు పరోక్షంగా కౌంటర్ వేశారు. మతపరమైన విషయాల్లో తమ ప్రభుత్వం కలుగజేసుకోదని ఆయన స్పష్టం చేశారు.
Nitish Kumar| మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలనే వివాదంపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఘాటుగా స్పందించారు. అదోక పనికిమాలిన చర్య అని అసమ్మతి వ్యక్తం చేశారు. బీజేపీ నేతలకు కౌంటర్ ఇచ్చేలా వ్యాఖ్యానించారు. మతపరమైన పద్ధతుల విషయాల్లో తమ ప్రభుత్వం కలుగజేసుకోదని ఆయన స్పష్టం చేశారు.
ఇఫ్తార్ విందుకు హాజరయ్యేందుకు హిందుస్థానీ అవామ్ మోర్చా (హమ్) జాతిపిత జితన్ రామ్ మాంఝీ నివాసానికి వచ్చిన ముఖ్యమంత్రి బీహార్లో వీటన్నింటికీ అర్థం లేదని మీడియాతో స్పష్టంగా చెప్పారు. ఎవరి పేరు చెప్పకుండానే మీరు ఏది చేయాలనుకుంటే అది చేయండని అన్నారు. మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను తొలగించడం వల్ల ప్రయోజనం లేదనీ. ఇదంతా నాన్సెన్స్. తాను అంగీకరించననీ అన్నారు.
కొంత మంది వివాదాలను సృష్టించడమే పనిగా పెట్టుకున్నారనీ, వారు అందులోనే ఉంటారని అని పరక్షంగా బీజేపీ నేతలను ఉద్దేశించి అన్నా రు. యూపీలో మతపరమైన ప్రాంతాల నుంచి లౌడ్స్పీకర్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో, రాష్ట్రప్రభు త్వం కూడా అలాగే చేయాలని బీహార్ బీజేపీ నేతల డిమాండ్ నేపథ్యంలో నితీశ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఈ వివాదంపై మాజీ ముఖ్యమంత్రి జితన్రామ్ మాంఝీ, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ కూడా స్పందించారు. లౌడ్ స్పీకర్ వివాదం అర్థరహితమని వ్యాఖ్యానించారు. నితీష్ కుమార్తో ఏకీభవించిన మాంఝీ.. లౌడ్స్పీకర్ను తొలగించడం సరికాదని అన్నారు. రాత్రింబవళ్లు రాజకీయాలు చేయడం వల్ల ఏమీ జరగదనీ, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తేజస్వి అన్నారు. నిరుద్యోగం గురించి మాట్లాడాలి, కానీ అది లౌడ్ స్పీకర్లలో జరుగుతోంది.
