Asianet News TeluguAsianet News Telugu

భారత్ వాస్తవికతను అతిథుల దగ్గర దాచాల్సిన అవసరం లేదు - రాహుల్ గాంధీ

భారతదేశ వాస్తవికతను జీ20 సదస్సు కోసం వచ్చిన అతిథులకు దాచాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. అతిథులు పేదలను, జంతువులను కేంద్ర ప్రభుత్వం చూడనివ్వడం లేదని ఆరోపించారు. 

No need to hide India's reality from guests - Rahul Gandhi..ISR
Author
First Published Sep 9, 2023, 4:26 PM IST

దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సదస్సు కొనసాగుతోంది. ప్రపంచ దేశాల నుంచి నాయకులు, వారి టీమ్ భారత్ కు చేరుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ వారికి స్వాగతం పలికారు. ఈ సదస్సు కోసం ఢిల్లీని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలత్తకుండా ఐటీ కంపెనీల ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అలాగే విద్యా సంస్థలు కూడా ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని సూచించింది. 

అయితే ఢిల్లీ వాస్తవికతను జీ20 సదస్సు కోసం వచ్చిన అతిథులకు కేంద్ర ప్రభుత్వం చూపెట్టడం లేదని కాంగ్రెస్ నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. యూరప్ పర్యటనలో భాగంగా ప్రస్తుతం బ్రస్సెల్ లో ఉన్న ఆయన.. భారత్ వాస్తవికతను అతిథుల నుంచి దాచాల్సిన అవసరం లేదని ట్వీట్ చేశారు. ‘‘భారత ప్రభుత్వం మన పేద ప్రజలను, జంతువులను దాచిపెడుతోంది’’ అని ఆయన పేర్కొన్నారు.

కాగా.. జీ20లోని అనేక అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై తన దాడిని కొనసాగిస్తోంది జీ20 శిఖరాగ్ర సమావేశానికి ముందు ఢిల్లీలోని వసంత్ విహార్ లోని మురికివాడ కూలీ క్యాంప్ ను షేర్ చేసింది. అందులో మురికివాడ కనిపించకుండా గ్రీన్ కలర్ షేడ్ తో దాచిన వీధులు కనిపిస్తున్నాయి.అంతర్జాతీయ నాయకులకు ఆతిథ్యం ఇచ్చేందుకు ఢిల్లీ సర్వం సిద్ధం కావడంతో అనేక వీధి కుక్కలను వారి మెడలు పట్టుకుని బోనుల్లో పడేశారని మరో వీడియోలో కాంగ్రెస్ పేర్కొంది. వాటికి ఆహారం, నీరు ఇవ్వకుండా తీవ్ర ఒత్తిడికి, భయానికి గురి చేస్తున్నారని పేర్కొంది. ఇలాంటి భయానక చర్యలకు వ్యతిరేకంగా గళం విప్పాల్సిన అవసరం ఉందని, గొంతులేని ఈ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని ఆ వీడియోలో పేర్కొన్నారు.

ద్వైపాక్షిక సమావేశం తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రధాని మోడీలను ప్రశ్నలు అడగడానికి మీడియాను భారత్ అనుమతించలేదని జైరాం రమేష్ పేర్కొన్నారు. అందుకే జీ20 ఒప్పందంలో అనేక 'లొసుగులు' ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కాగా.. జీ-20 విందుకు తనను ఆహ్వానించకపోవడం మంచి రాజకీయం కాదని, కేంద్రం చేయకూడని నీచమైన చర్య అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అన్నారు. ఈ విందుకు ఖర్గేను ఆహ్వానించకపోవడంపై రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు స్పందించారు. 60 శాతం భారత దేశాధినేతను ప్రభుత్వం గౌరవించడం లేదని ఇది తెలియజేస్తోందని రాహుల్ గాంధీ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios