Uttar Pradesh election result 2022: ఉత్తరప్రదేశ్ లో బీజేపీ దండయాత్ర కొనసాగుతోంది. తిరుగులేని అధిక్యంలో ముందుకు సాగుతూ.. మరోసారి అధికార పీఠం తమదేనని సంకేతాలు పంపింది. యూపీలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటిన క్రమంలో.. హిందూముస్లిం కాదు.. మేము అందరికోసం పనిచేశామని రాష్ట్ర మంత్రి సతీష్ మహానా అన్నారు.
Uttar Pradesh election result 2022: దేశంలో రాజకీయంగా అత్యం కీలకమైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటిన బీజేపీ.. ప్రస్తుత ట్రెండ్ గమనిస్తే.. 273 స్థానాలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతోంది. గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే అధిక సంఖ్యలో అధిక్యంలో సమాజ్ వాదీ పార్టీ కొనసాగతున్నప్పటికీ.. ఆ పార్టీ అంచనాలకు అందనంత దూరంలో నిలిచిపోయింది. దీంతో బీజేపీ రాష్ట్రంలో తిరుగులేని విధంగా మళ్లీ అధికారం ఏర్పాటు చేసే సంకేతాలు అందుతున్నాయి.
ఉత్తరప్రదేశ్ బీజేపీ హవాపై రాష్ట్ర మంత్రి సతీష్ మహానా గురువారం మాట్లాడుతూ.. రాష్ట్ర ఎన్నికలలో బీజేపీ అఖండ విజయంతో పార్టీ ఆకర్షణ హిందూ మెజారిటీ ఓటు పునాదిని మించిపోయిందనీ, తమ ప్రభుత్వ పథకాలు వారి మతంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల కోసం పనిచేశాయని అన్నారు. హిందూ-ముస్లింలు కాదు అన్ని వర్గాల వారి కోసం బీజేపీ పనిచేసిందనీ, ఈ క్రమంలోనే ప్రజలు ఈ విజయం అందించారని తెలిపారు.
"మా పార్టీకి ఈ ఫలితం [ప్రధాని నరేంద్ర] మోడీ జీ, [ముఖ్యమంత్రి] యోగి [ఆదిత్యనాథ్] జీల నాయకత్వమే కారణం. అవును, సంఖ్యలు సూచించినట్లుగా మేము మా ఓట్ల శాతాన్ని పెంచుకున్నాము. దీనికి కారణం ప్రజలు ఉంచిన విశ్వాసం. యోగి జీ నాయకత్వంలో.. ఆయన వాగ్దానాలు నెరవేర్చారు మరియు యూపీని మాఫియా రహితంగా మార్చారు" అని సతీష్ మహానా అన్నారు. "మేము ఇప్పుడు అభివృద్ధితో ముందుకు వెళ్తాము మరియు UPని భారతదేశంలో, ముఖ్యంగా తయారీలో అగ్రగామిగా మారుస్తాము. IT నుండి ఎలక్ట్రానిక్స్ వరకు, మేము UP కోసం పెద్ద ప్రణాళికలను కలిగి ఉన్నాము. ప్రజలు అందించిన మద్దతు మన మంచి పని మరియు కృషిని కొనసాగించాల్సిన అవసరం ఉంది" అని అన్నారు.
"మేము అందరి కోసం - హిందువులు, ముస్లింలు, అందరి కోసం నిలబడతాము. మా పథకాలు అందరి కోసం ఉన్నాయి. మేము హిందూ-ముస్లింల ప్రాతిపదికన తేడాలు మరియు భేదాభిప్రాయాలను చూపలేదు. మేము అందరి కోసం పని చేస్తాము. మేము అందరినీ వెంట తీసుకెళ్తాము. మోడీ జీ మరియు యోగి జీ నాయకత్వంలో , ప్రతి ఒక్కరూ ప్రయోజనం పొందుతున్నారు అని మహానా జోడించారు. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారు , భారతదేశం రాజకీయంగా అత్యంత కీలకమైన రాష్ట్రంలో ప్రత్యర్థులపై బీజేపీ తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది.
ఉత్తరప్రదేశ్ లో గురువారం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు నాలుగు గంటలు దాటిన క్రమంలో ప్రస్తుత ట్రెండ్ గమనిస్తే.. బీజేపీ హవా కొనసాగిస్తోంది. మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ అధిక్యం దాటి ముందుకు సాగుతోంది. ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రత్యర్థులైన సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్, బీఏస్పీలపై తిరుగులేని ఆధిక్యం సాధించి, మెజారిటీ మార్కును దాటింది. ఇప్పటివరకు అందిన ఎన్నికల కౌంటింగ్ వివరాల ప్రకారం.. బీజేపీ 273 స్థానాల్లో అధిక్యంలో ఉంది. సమాజ్ వాదీ పార్టీ 121 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ మూడు, బీఎస్పీలు ఐదు స్థానాల్లో అధిక్యంలో ఉండగా, ఇతరులు 1 స్థానాల్లో ముందంజలో ఉన్నారు.
