Asianet News TeluguAsianet News Telugu

కారుణ్య నియామకాలపై కర్ణాటక హైకోర్టు కీలక నిర్ణయం.. ఆ వివక్ష చూపరాదు..

కారుణ్య నియామకానికి సంబంధించి కర్ణాటక హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇలా వివక్ష చూపితే దత్తత తీసుకున్న ప్రయోజనం ఉండదని హైకోర్టు పేర్కొంది. ఈ నియమాకాల్లో దత్తత తీసుకున్న పిల్లలు, బయలాజికల్ పిల్లలు అనే వివక్ష చూపరాదని, దీనికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వ ప్రాసిక్యూషన్ విభాగం వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ సూరజ్ గోవింద్రాజ్ మరియు జస్టిస్ జి. బసవరాజు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

No Distinction Between Adopted & Biological Child On Job On Compassionate Grounds
Author
First Published Nov 22, 2022, 1:19 PM IST

కారుణ్య నియామకానికి సంబంధించి కర్ణాటక హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.ఈ నియమాకాల్లో దత్తత తీసుకున్న పిల్లలు, బయలాజికల్ పిల్లలు అనే వివక్ష చూపరాదని హైకోర్టు పేర్కొంది. దత్తత తీసుకున్న బిడ్డకు జీవసంబంధమైన బిడ్డకు సమానమైన హక్కులు ఉంటాయని పేర్కొంది. ఈ విషయంలో కారుణ్య ప్రాతిపదికన నియామకానికి సంబంధించి ఎలాంటి వివక్ష ఉండకూడదని పేర్కొంది. ఇలా వివక్ష చూపితే.. దత్తత తీసుకున్న ప్రయోజనం ఉండదని హైకోర్టు పేర్కొంది. దీనికి సంబంధించి కర్ణాటక ప్రభుత్వ ప్రాసిక్యూషన్ వాదనలను హైకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ సూరజ్ గోవింద్రాజ్, జస్టిస్ జి. బసవరాజు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రతివాది ప్రాసిక్యూషన్ డిపార్ట్‌మెంట్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌లు దత్తపుత్రుడు, జీవసంబంధమైన బిడ్డల మధ్య వ్యత్యాసాన్ని ఈ కేసులో కలిగి ఉండరని హైకోర్టు పేర్కొంది. శాఖ ప్రస్తుత నిబంధనలను ఉటంకిస్తూ.. దత్తపుత్రుడికి కారుణ్య నియామకం కోసం ఎటువంటి నిబంధన లేదని పేర్కొంది. దత్తత తీసుకున్నా, జీవనాధారమైనా కొడుకు కొడుకే, ఆడపిల్ల ఆడపిల్లే అని హైకోర్టు  తాజా తీర్పులో పేర్కొంది. వారిపై వివక్ష ఉంటే దత్తతకు అర్థం ఉండదనీ, వీటిలో వివక్ష చూపడం రాజ్యాంగంలోని 14వ అధికరణను ఉల్లంఘించడమే అవుతుందని హైకోర్టు పేర్కోన్నది.

సమస్య ఏమిటి? 

కర్ణాటకకు చెందిన వినాయక్ ఎం ముత్తట్టి బంహట్టిలోని జెఎంఎఫ్‌సిలోని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయంలో క్లాస్ IV ఉద్యోగి. ఆయన 2011లో ఒక అబ్బాయిని దత్తత తీసుకున్నారు. తదనంతరం..ముత్తట్టి మార్చి 2018లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదశాత్తువు మరణించాడు. అనంతరం అతని దత్తపుత్రుడు గిరీష్ కారుణ్య ప్రతిపదకగా ఉద్యోగం కోరుతూ దరఖాస్తు చేశాడు. దరఖాస్తుదారు దత్తపుత్రుడు అనే కారణంతో డిపార్ట్‌మెంట్ దరఖాస్తును తిరస్కరించింది. దత్తపుత్రుడికి కారుణ్య అపాయింట్‌మెంట్ ఇవ్వాలనే నిబంధన లేదని తేల్చి చెప్పింది. 

దీంతో కంగు తిన్న గిరీష్.. కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. కారుణ్య నియామకం కోసం దత్తపుత్రుడి దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవడానికి నిబంధనలలో ఎటువంటి నిబంధన లేనందున 2021లో గిరీష్ పిటిషన్‌ను సింగిల్ బెంచ్ కొట్టివేసింది. సింగిల్ బెంచ్ నిర్ణయాన్ని గిరీష్ డబుల్ బెంచ్ ముందు సవాల్ చేశారు. కారుణ్య నియామకం యొక్క ఉద్దేశ్యం సంపాదించే సభ్యుని మరణం కారణంగా కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తొలగించడమేనని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.  ఈ సందర్భంలో.. మరణించిన వ్యక్తి భార్య,కొడుకు, దత్తపుత్రుడు, కుమార్తెను విడిచిపెట్టాడు, వారు మానసికంగా,శారీరకంగా వికలాంగులుగా ఉన్నారు. జీవసంబంధమైన కుమారుడు మరణించినందున, దత్తపుత్రుడు కారుణ్య నియామకానికి అర్హులు. శాఖ వాదనను తోసిపుచ్చిన హైకోర్టు దత్తపుత్రుడి దరఖాస్తును సముచితంగా పరిగణించాలని పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios