నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో వచ్చి 9 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ పాలన 9 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. గత 9 ఏళ్లలో రక్షణ రంగంలో వచ్చిన ఈ మార్పులను ఒకసారి పరిశీలిద్దాం.. 

న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో వచ్చి 9 ఏళ్లు పూర్తయ్యాయి. ప్రధానిగా 9 ఏళ్లలో ప్రధాని మోదీ దేశం కోసం ఎన్నో కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్‌పై నిషేధం వంటి సాహోసపేతమైన నిర్ణయాలు కూడా అందులో ప్రధానంగా కనిపిస్తాయి. అదే సమయంలో దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు మోదీ ప్రభుత్వం నిరంతరం ప్రయత్నిస్తోంది. దేశ రక్షణ రంగానికి సంబంధించి కూడా ప్రధాని మోదీ పలు అతిపెద్ద నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ప్రయత్నాల ప్రభావం కూడా క్షేత్రస్థాయిలో కనిపించింది. ప్రధాని మోదీ పాలన 9 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. గత 9 ఏళ్లలో రక్షణ రంగంలో వచ్చిన ఈ మార్పులను ఒకసారి పరిశీలిద్దాం.. 

>>బడ్జెట్.. గత 9 సంవత్సరాలలో రక్షణ బడ్జెట్ స్థిరమైన పెరుగుదలను చూసింది. దీన్ని బట్టి దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఎంత నిబద్ధతతో ఉందో అంచనా వేయవచ్చు. రక్షణ రంగంలో ఆధునీకరణ, పరిశోధన, అభివృద్ధికి అధిక నిధులు కేటాయించారు.

>>దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రధాని మోదీ ప్రభుత్వం.. ప్రస్తుతం ఆధునిక ఆయుధాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతపై దృష్టి సారిస్తోంది. ఇందుకోసం దేశీయ రక్షణ ఉత్పత్తికి కూడా పెద్దపీట వేస్తున్నారు. ఈ ప్రకారమే.. రక్షణ కొనుగోళ్ల మొత్తం ప్రక్రియను నిర్వహిస్తున్నారు. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి.. దేశంలోనే రక్షణ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ ప్రాసెస్ (డీపీపీ), మేక్ ఇన్ ఇండియాపై దృష్టి సారించారు. 

>>దేశీయ రక్షణ తయారీని ప్రోత్సహించడానికి మేక్ ఇన్ ఇండియా, వ్యూహాత్మక భాగస్వామ్య నమూనా వంటి కార్యక్రమాలు ఉపయోగిస్తున్నారు. అంతే కాకుండా డిఫెన్స్ తయారీలో ప్రైవేట్ రంగాన్ని కూడా ప్రోత్సహించడంతోపాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

>>గత 9 సంవత్సరాలలో భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు సాయుధ బలగాల ఆధునీకరణపై మోడీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఇందుకోసం.. ఫైటర్ జెట్‌లు, జలాంతర్గాములు, ఫిరంగి వ్యవస్థలు, హెలికాప్టర్లు, క్షిపణి రక్షణ వ్యవస్థల కొనుగోలుతో సహా అనేక ప్రధాన రక్షణ ఒప్పందాలు, కొనుగోళ్లు ఖరారు చేయబడ్డాయి.

>>గత 9 సంవత్సరాలలో ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రక్షణ దౌత్యంపై చాలా దృష్టి సారించింది. ఇందుకోసం.. ద్వైపాక్షిక, బహుపాక్షిక సైనిక విన్యాసాలు, రక్షణ సంభాషణలు, సాంకేతికత బదిలీ.. భారతదేశంతో అనేక దేశాలతో రక్షణ సంబంధాలను బలోపేతం చేశాయి.

>>భారతదేశ సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. భారత్-చైనా, భారత్-పాకిస్థాన్ సరిహద్దు వంటి సున్నితమైన ప్రాంతాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి రోడ్లు, వంతెనలు, సొరంగాలు, ముందస్తు నిఘా వ్యవస్థలను సిద్ధం చేస్తున్నారు.

>>రక్షణ దళాల సామర్థ్యాన్ని, ప్రభావాన్ని పెంచడానికి ప్రభుత్వం నిర్మాణాత్మక సంస్కరణలను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఏకీకృత సైనిక కమాండ్ ఏర్పాటు, మూడు సేవల మధ్య ఉమ్మడి, ఏకీకరణను ప్రోత్సహించడంతో పాటు.. కొత్త రక్షణ సిద్ధాంతాల దిశగా అడుగులు పడ్డాయి.

>>దేశాన్ని స్వావలంబన చేయడంలో నిమగ్నమై ఉన్న ప్రభుత్వం.. దేశీయ రక్షణ సాంకేతికతను, రక్షణ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడంపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) సంస్కరణ, ప్రైవేట్ రంగాల సహకారంపై దృష్టి సారించింది.